Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: గుంటూరులోని అమృత యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లినా, చివరికి స్వదేశానికి తిరిగి వచ్చి దేశాభివృద్ధికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చదువు కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి సంస్కారాన్ని కూడా నేర్పాలని వెంకయ్య నాయుడు అన్నారు. తాను గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పలకతో చదువు ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల విద్యార్థులు ఒకప్పుడు భారతదేశంలోని నలందా, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారని చెప్పారు.
కుటుంబ విలువలను కాపాడుకోవాలి
తల్లిదండ్రులతో సమయం గడపాలని, కుటుంబ వ్యవస్థకు భారత్ మూలస్థానమని పేర్కొన్నారు వెంకయ్య.. చిన్న వయసులోనే తన తల్లి మరణించగా, తన తాతయ్య, అమ్మమ్మ తనను పెంచారని, ప్రపంచ జ్ఞానాన్ని వారే నేర్పారని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. ఇక, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) సమయంలో 17 నెలలు జైలులో ఉన్నానని, 1983లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 30 ఏళ్లు ప్రతిపక్షంలోనే పనిచేశానని, రాజకీయాల్లో ఉన్న సమయంలో వ్యక్తిగతంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి పేరు గోడలపై రాసిన తాను, తర్వాత ఆయనతో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒకే వేదికపై కూర్చోవడం జీవితంలో మరపురాని అనుభవమని చెప్పారు.
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
యువతకు ప్రేరణాత్మక సందేశం
“ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు” అని విద్యార్థులకు సూచించిన వెంకయ్య నాయుడు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రకృతిని ప్రేమించాలని, ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ఇక, “నేను పదవికి రిటైర్ అయ్యాను గానీ, పెదవికి రిటైర్ కాలేదు” అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించిన ఆయన, ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని, విశ్వగురువుగా నిలిచే సామర్థ్యం భారత్కు ఉందని అన్నారు. దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, ప్రతి యువకుడు దేశ పురోగతికి తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు..
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?