Vijayawada Floods: ముంపు బాధితుల వద్ద నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి..
- కేజీ బియ్యం రూ. 100.. అరలీటర్ రూ.35 పాల ప్యాకెట్ 100 రూపాయలకు అమ్మకం..
- ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూల్..
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nani : శిల్పాకళావేదికలో సరిపోదా శనివారం విజయ వేడుక.. డేట్ ఎప్పుడంటే..?
Also Read
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
మరోవైపు.. విజయవాడలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తీసుకు వస్తున్నారు.. ఫ్లై ఓవర్ దగ్గర అధికారులకు అందజేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాలకు ఆహారం సక్రమంగా పంపిణీ చేయక పోవటంతో మిగిలి పోయిన పదార్థాలను ఫ్లై ఓవర్ పైనే పారవేస్తున్నారు. ఓవైపు మూడు రోజులుగా ఆహారం లేక తాము ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఇలా వృథా చేయటం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృథా అయిన ఆహారం కుళ్లిపోతే కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముంపు ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Iran-Trump: మా కొత్త ఆయుధం ప్రదర్శిస్తే గుండెపోటు రావొచ్చు.. ట్రంప్నకు ఇరాన్ వార్నింగ్
-
Bhoghi : ‘కందుల సులోచన రాణి’గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Jasprit Bumrah: సీన్ రివర్స్.. బ్యాటర్ల ముందు బెంబేలెత్తిపోతున్న బుమ్రా.. కెరీర్లోనే చెత్త ప్రదర్శన!
-
Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
ట్రెండింగ్
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!