Vijayawada Floods: ముంపు బాధితుల వద్ద నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి..
- కేజీ బియ్యం రూ. 100.. అరలీటర్ రూ.35 పాల ప్యాకెట్ 100 రూపాయలకు అమ్మకం..
- ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nani : శిల్పాకళావేదికలో సరిపోదా శనివారం విజయ వేడుక.. డేట్ ఎప్పుడంటే..?
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
మరోవైపు.. విజయవాడలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తీసుకు వస్తున్నారు.. ఫ్లై ఓవర్ దగ్గర అధికారులకు అందజేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాలకు ఆహారం సక్రమంగా పంపిణీ చేయక పోవటంతో మిగిలి పోయిన పదార్థాలను ఫ్లై ఓవర్ పైనే పారవేస్తున్నారు. ఓవైపు మూడు రోజులుగా ఆహారం లేక తాము ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఇలా వృథా చేయటం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృథా అయిన ఆహారం కుళ్లిపోతే కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముంపు ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!