Vijayawada Floods: ముంపు బాధితుల వద్ద నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు..
- నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి..
- కేజీ బియ్యం రూ. 100.. అరలీటర్ రూ.35 పాల ప్యాకెట్ 100 రూపాయలకు అమ్మకం..
- ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Floods: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల అండగా ఉండాల్సింది పోయి.. కొందరు ప్రైవేట్ వ్యాపారులు దానికి క్యాష్ చేసుకుంటున్నారు. ఇంకా, వరద ప్రభావం నుంచి తేరుకోని విజయవాడను బుడమేరు వాగు నిండా ముంచేసింది. ఓవైపు ప్రజల ఆకలి కేకలు.. మరోవైపు వ్యాపారుల దోపడితో అల్లాడిపోతున్నారు. నిత్యావసరాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పరిస్థితి ఏర్పాడింది. ప్రకృతి విపత్తుతో మానవత్వం మరిచి వ్యాపారం చేసుకుంటున్నారు. కేజీ బియ్యం 100 రూపాయలు, 35 రూపాయల అర లీటర్ పాల ప్యాకెట్ ను వంద రూపాయలకు అమ్ముతున్నారు. ఇఖ, ఫోన్ గంట సేపు ఛార్జింగ్ పెడితే రూ. 50 వసూలు చేస్తున్నారు. ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్న డబ్బు ఖర్చు పెటాల్సిన పరిస్థితి ఏర్పాడింది. పడవ, ట్రాక్టర్ ప్రయాణానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు పెట్టాల్సిన వస్తుంది. ఇలా ప్రైవేట్ వ్యాపారులు అడ్డగోలుగా నిలువు దోపిడి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Nani : శిల్పాకళావేదికలో సరిపోదా శనివారం విజయ వేడుక.. డేట్ ఎప్పుడంటే..?
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
మరోవైపు.. విజయవాడలోని సింగ్ నగర్ ఫ్లై ఓవర్ ప్రాంతంలో ఆహార పదార్థాలను వృథాగా పారవేస్తున్నారు. వరద బాధితులకు సాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపుతో దాతలు పెద్ద ఎత్తున ఆహార పదార్థాలను తీసుకు వస్తున్నారు.. ఫ్లై ఓవర్ దగ్గర అధికారులకు అందజేస్తున్నారు. అయితే శివారు ప్రాంతాలకు ఆహారం సక్రమంగా పంపిణీ చేయక పోవటంతో మిగిలి పోయిన పదార్థాలను ఫ్లై ఓవర్ పైనే పారవేస్తున్నారు. ఓవైపు మూడు రోజులుగా ఆహారం లేక తాము ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఇలా వృథా చేయటం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృథా అయిన ఆహారం కుళ్లిపోతే కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని ముంపు ప్రాంత బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!