Minister Bala Veeranjaneya Swamy: దేశంలోనే అత్యధిక పింఛన్లు ఏపీలోనే.. ప్రభుత్వంపై నింధలు సరికాదు..
- ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం..
- దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే..
- ప్రభుత్వంపై నింధలు వేయడం కరెక్ట్ కాదన్దన మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
Minister Bala Veeranjaneya Swamy: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచింది.. అంతేకాదు.. ప్రతీ నెల ఫస్ట్ రాకముందే.. ఈ పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటుంది.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు.. సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికి వెళ్లే పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం విదితమే.. అఇయతే, దేశంలోనే అత్యధిక పింఛన్లు ఆంధ్రప్రదేశ్లోనే ఇస్తున్నాం.. అనవసరంగా ప్రభుత్వంపై నింధలు వేయడం కరెక్ట్ కాదని హితవు చెప్పారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి..
Also Read
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం అన్నారు.. దేశంలో అత్యధికంగా పింఛన్లు ఇస్తుంది ఏపీలోనే అని స్పష్టం చేశారు.. అయితే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నాయకులు.. కూటమి ప్రభుత్వం పై నింధలు వేయడం కరెక్ట్ కాదన్నారు.. గత ప్రభుత్వంలో ఫీజు రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో ఉద్యోగాలకు కూడా వెళ్లలేకపోతున్నారన్న ఆయన.. జగన్ ఇప్పుడు మోసలి కన్నీరు కారుస్తున్నాడు అంటూ ఫైర్ అయ్యారు. ఇక, వైఎస్ జగన్ నష్టపరిచిన వ్యవస్థల్ని చక్కదిద్దుతున్నాం. జగన్ కి ఎన్నికల్లో 11 సీట్లు వచ్చాయి.. ఈసారి ఒక్క సీటు కూడా రాదు అంటూ జోస్యం చెప్పారు.. గత ప్రభుత్వంలో చేసిన విద్యుత్ ఒప్పందాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అంతేకాదు.. స్వర్గీయ ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే.. ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే అన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. ఎన్టీఆర్ 30 రూపాయలతో వృద్ధాప్య పింఛన్ మొదలుపెడితే, ఇప్పుడు నాలుగు వేలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!