Peddireddy Ramachandra Reddy: చంద్రబాబులాగా సీఎం జగన్ రైతుల్ని, మహిళల్ని మోసం చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy Fires On Chandrababu Naidu: చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం.. అంబేద్కర్ భవన్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో సీఎం జగన్కు అనేకమంది మహిళలు తమ కష్టాలు తెలిపారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చెందారన్నారు. అందుకే.. సీఎం జగన్ మహిళల కష్టాలను విని.. నవరత్నాలులో వైఎస్సార్ ఆసరాను పొందుపరిచారన్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ విజయం సాధించిందన్నారు. రెండో మూడో ఎమ్మెల్సీలు గెలవగానే.. అధికారంలోకి వచ్చామని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కంటే వైసీపీకి మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబులాగా సీఎం జగన్ రైతులను, మహిళలను మోసం చేయలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
Jasprit Bumrah : బుమ్రా గాయంపై వీడని సస్పెన్స్! అసలు విషయం దాస్తున్న బీసీసీఐ..
Also Read
- Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
- OTR: పోలవరం క్రెడిట్ రేస్లోకి ఏపీ బీజేపీ.? ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్ సైట్కు.!
అంతకుముందు.. వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం జగన్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలోనూ అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందన్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని.. మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని తెలియజేశారు.
GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?