GVL Narasimha Rao: 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao Fires On YCP Rahul Gandhi: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలనే వైసీపీ ప్రభుత్వ ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. ఇవన్నీ ఓటు బ్యాంక్ కోసం చేస్తున్న రాజకీయాలని.. ఇలాంటి రాజకీయ ప్రయత్నాలను బీజేపీ వ్యతిరేకిస్తోందని అన్నారు. 2017లో టీడీపీ చేసిన తప్పే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీలు కూటమి కట్టి.. నైతికత లేకుండా పోరాటాల పేరుతో రోడ్డెక్కుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కోర్టు తీర్పును రాజకీయ పార్టీలు వక్రీకరిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పుడైనా ముప్పు వాటిల్లిందంటే.. అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేని ఆరోపణలు చేశారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకే.. కాంగ్రెస్ పార్టీ నాయకులు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నోటి దురుసు, అహంకారంతో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లుగా దూషణలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సామాజిక వర్గమంతా దొంగలు అనడం.. రాహుల్ అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.
CM Jagan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పొదుపు సంఘాలు దేశానికే రోల్మోడల్గా నిలిచాయి
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అంతకుముందు.. ఈసారి తమకు అవకాశం ఇస్తే, సమస్యలను ప్రధాని మోడీకి చూపించి అభివృద్ధి చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక్క బీజేపీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమని.. ఇక్కడి నుంచి పొట్టకూటి కోసం ప్రజలు వలస వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో గెలిచిన ఎంపీలు.. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో గానీ, సంబంధిత మంత్రులు గానీ కలిసిన దాఖలాలు లేవన్నారు. అపారమైన వనరులు ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఈ ప్రాంతం నుంచి పెద్దపెద్ద నాయకులు ఎన్నుకోబడినా.. ప్రయోజనం మాత్రం శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారని, ఇది దురదృష్టకరమని జీవీఎల్ పేర్కొన్నారు.
Rahul Gandhi: ప్రధాని కళ్లలో భయం చూశా.. అందుకే నాపై అనర్హత వేటు
తాజావార్తలు
-
God Of War : సాయంత్రం 5.04 గంటలకు ‘విల్లాల వీరుడి’ ఆగమనం
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
-
Sankranthi 2027: మరోసారి చిరు వర్సెస్ బాలయ్య?.. సంక్రాంతి పోరుకు రంగం సిద్ధమా!
-
Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన ‘బేబీ బాస్’.. వైభవ్కు ఎందుకు ఛాన్స్ లేదు?
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!