Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Pawan Kalyan Speech In Bhimavaram Public Speech

Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం

Published Date :June 27, 2023 , 5:33 pm
By NTV WebDesk
Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan Speech In Bhimavaram Public Speech: వచ్చే ఎన్నికల్లో తమ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. తూర్పుకాపుల జనగణన చేపడతామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరిలోని భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పుకాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని చెప్పారు. 2014లో తన పోరాటయాత్ర శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తుంటారని, ఉత్తరాంధ్ర కార్మికులు సాహసికులని పేర్కొన్నారు. తూర్పుకాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారని, కానీ నిజానికి 45 లక్షల మంది తూర్పుకాపులు ఉన్నారని పవన్ వివరించారు. మరి, ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలే ఉన్నారని చెబుతోందంటూ ప్రశ్నించారు. వారికి పథకాలు అందకుండా చేయడానికే వైసీపీ అలా అంటోందని ఆరోపించారు.

Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్‌లలో ఎవరొచ్చినా రెడీ

Also Read

  • Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
  • Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
  • AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
  • Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు

చట్టంలో అందరికీ న్యాయం జరిగితే, కులాలతో సంబంధం లేదని.. కానీ చట్టం పనిచేయనప్పుడు మాత్రం అందరం కులాల వైపు చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. అయితే వాళ్లు ఎదుగుతున్నారే తప్ప, కులాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆలోచించాలని సూచించారు. తూర్పుకాపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. తాము తిన్న తర్వాతైనా కులం గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణాలో 31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పుకాపులను తొలగించారని, అయినా అప్పటి నాయకులు పట్టించుకోలేదని పవన్ విరుచుకుపడ్డారు. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల జనగణనకు తాను అనుకూలంగా ఉన్నానని అన్నారు.

Triple Talaq: ట్రిపుల్ తలాక్‌ను నిషేధించిన ఇస్లామిక్ దేశాలు ఇవే..

అయినా తాను సీఎం అయితే, అన్ని సమస్యలూ పరిష్కారమవ్వమని.. సీఎం అవ్వడం అన్నింటికి మంత్రదండం కాదని పవన్ కళ్యాణ్ చమత్కరించారు. తాను సీఎం అయ్యాక.. అధికారులో, నాయకులో కచ్ఛితంగా అడ్డుపడతారన్నారు. కేవలం చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తాను సీఎం అయ్యాక, తనని నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు. కానీ.. ఇప్పుడు కేసు పెట్టాలన్నా, ఎమ్మెల్యేలు అడ్డుపడే పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని అభీష్టించారు. ఒక్క ఎమ్మెల్యే పని చేయడని, ప్రశ్నిస్తే బూతులు తిడతారని విరుచుకుపడ్డారు. దేశంలో ‘కులం’ బలంగా మారడానికి.. వ్యవస్థలు సరిగా పని చేయకపోవడమే కారణమన్నారు. తనకు రాత్రి నుంచి జ్వరం ఉన్నా.. మీ అందరినీ చూశాక ఎలా అయినా రావాలని ఇక్కడివరకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap politics
  • Janasena Bhimavaram Meeting
  • pawan kalyan
  • Varahi Yatra
  • YS Jagan Mohan Reddy

తాజావార్తలు

  • Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

  • Lavanya : మా రామ్ చరణ్‌ బావకి థాంక్స్!

  • Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!

  • Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?

  • NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions