Pawan Kalyan: జనసేన అధికారంలోకి వస్తే, తూర్పుకాపుల జనగణన చేపడతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Speech In Bhimavaram Public Speech: వచ్చే ఎన్నికల్లో తమ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. తూర్పుకాపుల జనగణన చేపడతామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరిలోని భీమవరంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పుకాపుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి బీజం పడింది భీమవరంలోనేనని చెప్పారు. 2014లో తన పోరాటయాత్ర శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని అన్నారు. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తుంటారని, ఉత్తరాంధ్ర కార్మికులు సాహసికులని పేర్కొన్నారు. తూర్పుకాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతున్నారని, కానీ నిజానికి 45 లక్షల మంది తూర్పుకాపులు ఉన్నారని పవన్ వివరించారు. మరి, ఏ ప్రాతిపదికన వైసీపీ 16 లక్షలే ఉన్నారని చెబుతోందంటూ ప్రశ్నించారు. వారికి పథకాలు అందకుండా చేయడానికే వైసీపీ అలా అంటోందని ఆరోపించారు.
Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్లలో ఎవరొచ్చినా రెడీ
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
చట్టంలో అందరికీ న్యాయం జరిగితే, కులాలతో సంబంధం లేదని.. కానీ చట్టం పనిచేయనప్పుడు మాత్రం అందరం కులాల వైపు చూస్తామని పవన్ వ్యాఖ్యానించారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. అయితే వాళ్లు ఎదుగుతున్నారే తప్ప, కులాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆలోచించాలని సూచించారు. తూర్పుకాపుల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. తాము తిన్న తర్వాతైనా కులం గురించి ఆలోచించాలని హితవు పలికారు. ఇతర బీసీ కులాలకు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు. ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏమిటి? అని నిలదీశారు. తెలంగాణాలో 31 కులాలను బీసీ జాబితా నుంచి తూర్పుకాపులను తొలగించారని, అయినా అప్పటి నాయకులు పట్టించుకోలేదని పవన్ విరుచుకుపడ్డారు. ఈ సమాజంలో ఖచ్చితంగా మార్పు రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులాల జనగణనకు తాను అనుకూలంగా ఉన్నానని అన్నారు.
Triple Talaq: ట్రిపుల్ తలాక్ను నిషేధించిన ఇస్లామిక్ దేశాలు ఇవే..
అయినా తాను సీఎం అయితే, అన్ని సమస్యలూ పరిష్కారమవ్వమని.. సీఎం అవ్వడం అన్నింటికి మంత్రదండం కాదని పవన్ కళ్యాణ్ చమత్కరించారు. తాను సీఎం అయ్యాక.. అధికారులో, నాయకులో కచ్ఛితంగా అడ్డుపడతారన్నారు. కేవలం చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తాను సీఎం అయ్యాక, తనని నిలదీసే స్థితికి ప్రజలు రావాలన్నారు. కానీ.. ఇప్పుడు కేసు పెట్టాలన్నా, ఎమ్మెల్యేలు అడ్డుపడే పరిస్థితి ఉందన్నారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని అభీష్టించారు. ఒక్క ఎమ్మెల్యే పని చేయడని, ప్రశ్నిస్తే బూతులు తిడతారని విరుచుకుపడ్డారు. దేశంలో ‘కులం’ బలంగా మారడానికి.. వ్యవస్థలు సరిగా పని చేయకపోవడమే కారణమన్నారు. తనకు రాత్రి నుంచి జ్వరం ఉన్నా.. మీ అందరినీ చూశాక ఎలా అయినా రావాలని ఇక్కడివరకు వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!