Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్లలో ఎవరొచ్చినా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Nandigam Suresh Challenges Pawan Chandrababu Lokesh: చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు హయాంలో జరిగిన నష్టంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని.. ఆ ముగ్గురిలో ఎవరొచ్చినా తనకు ఓకే అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. తాడేపల్లిలో నందిగం సురేష్ మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, చంద్రబాబు కోర్టులకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్సీలు చదువుకోరని, ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఆర్డిఏ ప్రాంతంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం తాను నిరూపిస్తానని నందిగం సురేష్ పేర్కొన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు.. ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో పోల్చి అవమానించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను అచ్చెన్నాయుడు ఎప్పుడైనా ఖండించాడా? అని ప్రశ్నించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న వ్యాఖ్యలకు చంద్రబాబు ఇంకా కట్టుబడి ఉన్నాడని.. అందుకే ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?
Also Read
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
అంతకుముందు కూడా.. మాదిగలకు చంద్రబాబు ఏం చేశాడని నందిగం సురేష్ ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదన్నారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే.. చంద్రబాబు వాటిని అడ్డుకుని, కేసులు పెట్టించారని ఆరోపించారు. 2014లో మాదిగ కులానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 8 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరూ వైసీపీతోనే ఉన్నారని చెప్పిన ఆయన.. మాదిగ సభల్లో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని, అందుకు వారికి సిగ్గుండాలని విమర్శించారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ఏమాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు అన్నీ కులాల వారినీ మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. వచ్చే 20 ఏళ్ల వరకు ఈ రాష్ట్రానికి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని నందిగం సురేష్ ఉద్ఘాటించారు.
Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!