Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్లలో ఎవరొచ్చినా రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Nandigam Suresh Challenges Pawan Chandrababu Lokesh: చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు హయాంలో జరిగిన నష్టంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని.. ఆ ముగ్గురిలో ఎవరొచ్చినా తనకు ఓకే అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. తాడేపల్లిలో నందిగం సురేష్ మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, చంద్రబాబు కోర్టులకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్సీలు చదువుకోరని, ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఆర్డిఏ ప్రాంతంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం తాను నిరూపిస్తానని నందిగం సురేష్ పేర్కొన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు.. ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో పోల్చి అవమానించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను అచ్చెన్నాయుడు ఎప్పుడైనా ఖండించాడా? అని ప్రశ్నించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న వ్యాఖ్యలకు చంద్రబాబు ఇంకా కట్టుబడి ఉన్నాడని.. అందుకే ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?
Also Read
- Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
అంతకుముందు కూడా.. మాదిగలకు చంద్రబాబు ఏం చేశాడని నందిగం సురేష్ ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదన్నారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే.. చంద్రబాబు వాటిని అడ్డుకుని, కేసులు పెట్టించారని ఆరోపించారు. 2014లో మాదిగ కులానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 8 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరూ వైసీపీతోనే ఉన్నారని చెప్పిన ఆయన.. మాదిగ సభల్లో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని, అందుకు వారికి సిగ్గుండాలని విమర్శించారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ఏమాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు అన్నీ కులాల వారినీ మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. వచ్చే 20 ఏళ్ల వరకు ఈ రాష్ట్రానికి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని నందిగం సురేష్ ఉద్ఘాటించారు.
Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..