Nandigam Suresh: ఎంపీ నందిగం సురేష్ సవాల్.. బాబు, లోకేష్, పవన్లలో ఎవరొచ్చినా రెడీ
MP Nandigam Suresh Challenges Pawan Chandrababu Lokesh: చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లకు ఎంపీ నందిగం సురేష్ సవాల్ విసిరారు. ఎస్సీలకు జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు హయాంలో జరిగిన నష్టంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని.. ఆ ముగ్గురిలో ఎవరొచ్చినా తనకు ఓకే అని ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలన్నారు. తాడేపల్లిలో నందిగం సురేష్ మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, చంద్రబాబు కోర్టులకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎస్సీలు చదువుకోరని, ఎస్సీలు శుభ్రంగా ఉండరని చెప్పిన టీడీపీ నేతలు.. ఇప్పుడు ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని మాట్లాడటం, దెయ్యాలు వేదాలు వెల్లడించినట్లు ఉందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఆర్డిఏ ప్రాంతంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం తాను నిరూపిస్తానని నందిగం సురేష్ పేర్కొన్నారు. పుల్లారావు మంత్రిగా ఉన్నప్పుడు.. ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో పోల్చి అవమానించాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను అచ్చెన్నాయుడు ఎప్పుడైనా ఖండించాడా? అని ప్రశ్నించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న వ్యాఖ్యలకు చంద్రబాబు ఇంకా కట్టుబడి ఉన్నాడని.. అందుకే ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదని వ్యాఖ్యానించారు.
SS Rajamouli: హీరోలను తలదన్నే లుక్లో జక్కన్న.. ఫస్ట్ యాడ్ కు అన్ని కోట్లు ఛార్జ్ చేశాడా?
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అంతకుముందు కూడా.. మాదిగలకు చంద్రబాబు ఏం చేశాడని నందిగం సురేష్ ప్రశ్నించారు. 2014 మేనిఫెస్టోలో మాదిగ కార్పొరేషన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. గెలిచిన తర్వాత దాని ఊసే ఎత్తలేదన్నారు. గతంలో మాదిగలు సభలు పెట్టుకుంటే.. చంద్రబాబు వాటిని అడ్డుకుని, కేసులు పెట్టించారని ఆరోపించారు. 2014లో మాదిగ కులానికి ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదని.. కానీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం 8 మంది ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీలందరూ వైసీపీతోనే ఉన్నారని చెప్పిన ఆయన.. మాదిగ సభల్లో టీడీపీ నేతలు అబద్ధాలు మాట్లాడారని, అందుకు వారికి సిగ్గుండాలని విమర్శించారు. చంద్రబాబుకు ఎస్సీలంటే ఏమాత్రం ఇష్టం లేదన్నారు. చంద్రబాబు అన్నీ కులాల వారినీ మోసం చేశారని ఆరోపణలు గుప్పించారు. వచ్చే 20 ఏళ్ల వరకు ఈ రాష్ట్రానికి వైఎస్ జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని నందిగం సురేష్ ఉద్ఘాటించారు.
Merugu Nagarjuna: చంద్రబాబు దళిత ద్రోహి.. దళితులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా?
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో