Pawan Kalyan: విద్యుత్ షాక్తో రైతుల మృతి బాధాకరం.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్తో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్తో రైతులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుత్ షాక్ కారణంగా పొలంలోనే మృతి చెందిన దుర్ఘటన తనను కలచి వేసిందన్నారు. తెగిన విద్యుత్ వైరు పొలంలో పడటం మూలంగా మృత్యువాత పడ్డ పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి, బాల ఓబుల్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డిల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Also: Andhra Pradesh: రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్లో మార్పులు
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
కాగా విద్యుత్ వైర్లు తెగిపడ్డ ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఉందని క్షేత్ర స్థాయి నుంచి తనకు సమాచారం వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టడంపై చూపే శ్రద్ధను ముందుగా విద్యుత్ తీగలు సక్రమంగా ఉండేలా చూడాలని పవన్ హితవు పలికారు. ఉడతలు కొరికాయి కాబట్టి తీగలు తెగాయి లాంటి కారణాలు చెప్పి సమస్యను మరుగున పడేయవద్దని సూచించారు. బాధిత రైతు కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుని న్యాయబద్ధమైన పరిహారం అందించాలని పవన్ కళ్యాణ్ కోరారు.
విద్యుత్ షాక్ తో రైతుల దుర్మరణం దురదృష్టకరం – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/5KSP8wVNMx
— JanaSena Party (@JanaSenaParty) October 28, 2022
తాజావార్తలు
-
Virat Kohli: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీ.. 105తో RCBని టాప్కి.. క్రిస్ గేల్ వరల్డ్ రికార్డ్ బ్రేక్
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!