TDP: వీధిన పడుతున్న టీడీపీ గొడవలు..! హాట్ టాపిక్గా విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యే వివాదం..
- విజయవాడ ఎంపీ వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే వివాదం..
- కొలికలపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం..
- టీడీపీ అధిష్టానం సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత క్రమశిక్షణ… టీడీపీ లో కట్టుబాట్లు ఎక్కువ అని నేతలు చెబుతూ ఉంటారు.. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.. గతంలో టీడీపీ నేతలు కొంత క్రమశిక్షణ తోనే ఉన్న పరిస్థితి.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు బాగా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది… ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్కోవడం.. పాలనా పరంగా.. రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎంపీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్నారు కొలికలపూడి.. పదవులు అమ్ముకుంటున్నారు అన్నారు.. దీనిపై ఎంపీ కూడా ఘాటుగా స్పందించారు.. తను నిఖార్సయిన టీడీపీ కార్యకర్తను అంటున్నారు కేశినేని చిన్ని.. తనపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు..
Read Also: Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
ఒక గిరిజన మహిళ వివాదంతో మొదలైన ఘటన వీరి మధ్య వివాదానికి కారణం అయింది… టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా రచ్చ స్టార్ట్ అయింది.. ఇంకా కొన్ని జిల్లాలో ఎంపీ.. ఎమ్మెల్యే ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీ బైరెడ్డి శబరి.. ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డి అంశం. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్ట్ గా కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నేతలు ఇదే తరహా వైఖరి కొనసాగించడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది… పార్టీ లైన్ దాటి పోవద్దు అని చెప్తున్నా కూడా ఇదే లైన్ లో నేతలు ఉన్నారు.. దీంతో టీడీపీ అధిష్టానం.. తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలను రేపు పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచినట్టుగా తెలుస్తోంది.. దీంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ అయింది.. అయితే, నాకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదు.. నన్ను ఎవరు రేపు పార్టీ ఆఫీసుకి రమ్మని చెప్పలేదు అన్నారు ఎంపీ కేశినేని చిన్ని… నాపై ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయలేదన్న ఆయన.. ఎమ్మెల్యే కొలికపూడిని రేపు అధిష్టానం రమ్మని చెప్పారేమో నాకు సమాచారం లేదన్నారు కేశినేని చిన్ని.. మరి ఎవరెవరిని టీడీపీ అధిష్టానం పిలిచింది.. ఎవరిపై చర్యలు తీసుకోనున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Rajya Sabha Poll: జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్కు షాక్, ఎన్డీయే అభ్యర్థి విజయం
-
PM Modi: ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి.. వివాటెక్ ఈవెంట్లో పాల్గొన్న మోడీ
-
TGPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో నోటిఫికేషన్ విడుదల.!
-
Ranchi RSS attack: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్కౌంటర్, గాయాలు..
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
ట్రెండింగ్
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!