NTR District: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస.. లక్ష మందికి సరిపోయేలా ఆహారం..!
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు..
- లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం..
- సహాయక చర్యల కోసం అదనపు బోట్లు ట్రాక్టర్లు తెప్పించాలని ఆదేశం..
- సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే బస చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్లు.. అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని పేర్కొన్నారు. అలాగే, అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు: నివేదిక
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
ఇక, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు తెలిపారు. వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని కోరారు. అన్ని షాప్ల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించాలి.. అక్షయపాత్రతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని అధికారులకు సీఎం సూచనల చేశారు. ఖర్చు గురించి ఆలోచించకుండా పని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Samit Dravid: అండర్-19కి ఎంపికయ్యాడు కానీ.. ప్రపంచకప్కు ‘అనర్హుడు’ ఎందుకో తెలుసా..?
కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం బసకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రికి కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస చేయనున్నారు. వరద సహయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద పరిస్థితిపై అధికారులు సీరియెస్ నెస్ లేకుండా వ్యవహరించారని భావిస్తూన్నాను.. తాను క్షేత్ర స్థాయికి వెళ్తే తప్ప.. అధికారులు స్పందించ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి సివియార్టీని గుర్తించి సీరియెస్ నెస్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..