NTR District: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస.. లక్ష మందికి సరిపోయేలా ఆహారం..!
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు..
- లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలన్న సీఎం..
- సహాయక చర్యల కోసం అదనపు బోట్లు ట్రాక్టర్లు తెప్పించాలని ఆదేశం..
- సాధారణ స్థితి వచ్చే వరకు కలెక్టరేట్లోనే బస చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం..
NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు. విజయవాడ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్లు.. అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని పేర్కొన్నారు. అలాగే, అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు: నివేదిక
Also Read
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
- 10th Student Dies: ఇంటికెళ్లి వస్తామని డాక్టర్కి చెప్పి.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
ఇక, సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు తెలిపారు. వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని కోరారు. అన్ని షాప్ల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించాలి.. అక్షయపాత్రతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని అధికారులకు సీఎం సూచనల చేశారు. ఖర్చు గురించి ఆలోచించకుండా పని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Samit Dravid: అండర్-19కి ఎంపికయ్యాడు కానీ.. ప్రపంచకప్కు ‘అనర్హుడు’ ఎందుకో తెలుసా..?
కాగా, కలెక్టరేట్ ప్రాంగణంలో సీఎం బసకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రికి కలెక్టరేట్ ప్రాంగణంలో బస్సులోనే బస చేయనున్నారు. వరద సహయక చర్యల్లో అధికారుల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద పరిస్థితిపై అధికారులు సీరియెస్ నెస్ లేకుండా వ్యవహరించారని భావిస్తూన్నాను.. తాను క్షేత్ర స్థాయికి వెళ్తే తప్ప.. అధికారులు స్పందించ లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి సివియార్టీని గుర్తించి సీరియెస్ నెస్ గా పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!