Samit Dravid: అండర్-19కి ఎంపికయ్యాడు కానీ.. ప్రపంచకప్కు ‘అనర్హుడు’ ఎందుకో తెలుసా..?
- భారత అండర్ 19 జట్టులో సమిత్ ద్రవిడ్కు అవకాశం
- భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్
- అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడటం కష్టమే.
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు సమిత్ ద్రవిడ్కు భారత అండర్ 19 జట్టులో అవకాశం లభించింది. సెప్టెంబర్, అక్టోబర్లలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగనున్న వన్డే, నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్లో ఆడనున్నాడు. కాగా.. కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ద్రవిడ్ కర్ణాటక తరపున అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలో.. అతనికి రివార్డ్ లభించింది. అయితే.. భారత అండర్-19 జట్టుకు తొలిసారి ఎంపికైన సమిత్ ద్రవిడ్, అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో భారత్ తరఫున ఆడలేడు.
Read Also: Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. షాప్ ఓపెన్ తర్వాత 30 నిమిషాల్లోనే లూటీ.. వీడియో వైరల్..
Also Read
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
తదుపరి అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియాలో జరగనుంది. ప్రస్తుతం సమిత్ ద్రవిడ్ వయసు 18 ఏళ్లు. ఇతను.. 2005 నవంబర్ 10న జన్మించాడు. అతని 19వ పుట్టినరోజు జరుపుకోవడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే.. 2026లో జరిగే ప్రపంచకప్కు బీసీసీఐ అండర్-19 జట్టును ఎంపిక చేసేటప్పుడు, అతడికి 21 ఏళ్లు నిండుతాయి. దీంతో జట్టులో ఎంపికకు అర్హత ఉండదు. ఈ కారణంగా ప్రపంచకప్ ఆడలేడు. ప్రపంచ కప్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో జరిగితే.. 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో ప్రపంచ కప్ ఆడవచ్చు.
Read Also: Maharashtra: సోదరిని ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేసిన తమ్ముడు..
సమిత్ ద్రవిడ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న మహారాజా టీ20 ట్రోఫీలో ఆడుతున్నాడు. అతను మైసూర్ వారియర్స్ జట్టులో సభ్యుడు. మిడిల్ ఆర్డర్లో 114 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్లలో మొత్తం 82 పరుగులు చేశాడు. అతను పేస్ ఆల్ రౌండర్, కానీ అతని ఫాస్ట్ బౌలింగ్ సామర్ధ్యాలు ఉపయోగించడంలేదు. అండర్-19 స్థాయికి నాలుగు రోజుల ఫార్మాట్ దేశీయ టోర్నమెంట్ అయిన కూచ్ బెహార్ ట్రోఫీలో సమిత్ ఆడాడు. ఈ టోర్నీలో కర్ణాటక తరఫున ఎనిమిది మ్యాచ్లు ఆడి 362 పరుగులు చేసి 16 వికెట్లు పడగొట్టాడు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!