Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు: నివేదిక
- షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత మైనారిటీలపై దాడులు..
- బలవంతంగా మైనారిటీ ఉపాధ్యాయుల రాజీనామా..
- బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో 205 దాడులు..
- తాజా నివేదికలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో జరిగిన హింసాత్మక ఆందోళనలు ఏకంగా షేక్ హసీనా ప్రభుత్వాన్నే కూల్చాయి. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయాలని విద్యార్థులు, ప్రజలు ఆందోళనలు చేశారు. చివరకు ఆ దేశ ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు.
ఇదిలా ఉంటే, షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత నుంచి ఆ దేశంలో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు జరిగాయి. హింసాత్మక బంగ్లాదేశ్లోని మైనారిటీ సంస్థ బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ పంచుకున్న నివేదిక ప్రకారం, ఆగస్టు 5న షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పతనం తర్వాత మైనారిటీ వర్గాలకు చెందిన కనీసం 49 మంది ఉపాధ్యాయులు రాజీనామా చేయవలసి వచ్చింది.బంగ్లాదేశ్ ఛత్ర ఓక్య పరిషత్ బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్య పరిషత్ విద్యార్థి విభాగం. మైనారిటీ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులు బలవంతంగా రాజీనామాలను చేయాల్సి వచ్చిందని శనివారం నివేదికను విడుదల చేశారు.
Also Read
- UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
- Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
Read Also: Giriraj Singh: ‘‘హిందువులు ఎప్పుడూ సెలవులను డిమాండ్ చేయరు’’.. నమాజ్ బ్రేక్ రద్దుపై కేంద్రమంత్రి..
దేశవ్యాప్తంగా మైనారిటీ ఉపాధ్యాయులు భౌతిక దాడుల్ని ఎదుర్కొన్నారు. వారిలో కనీసం 49 మంది రాజీనామా చేయాల్సి వచ్చిందిన సమన్వయకర్త సాజిబ్ సర్కార్ చెప్పారు. అయితే, వీరిలో 19 మందిని తర్వాత తిరిగి నియమించినట్లు నివేదిక పేర్కొంది. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లోని హిందువులు, బౌద్ధులు, క్రైస్తవ సంఘాల సభ్యులపై అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి. దేవాలయాలను తగలబెట్టడంతో పాటు మహిళలపై అత్యాచారాలు చోటు చేసుకున్నాయి.
ఈ అల్లర్ల తర్వాత నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ మరియు బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ సంస్థలు సంకలనం చేసిన డేటా ప్రకారం, హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి దేశంలోని మైనారిటీ వర్గాల సభ్యులు 52 జిల్లాల్లో కనీసం 205 దాడులను ఎదుర్కొన్నారు.
తాజావార్తలు
-
Coffee Mug Cleaning Tips: కాఫీ మగ్ క్లీనింగ్కు సూపర్ టిప్స్.. నిమిషాల్లో కొత్తదానిలా మెరిపించండి!
-
Vaibhav Sooryavanshi: నాడు సంజూ.. నేడు వైభవ్.. టాలెంట్ ఒక్కటే సరిపోదు.. టీమిండియా సెలక్షన్ ఫార్ములా ఇదే..
-
UP: లవర్ కోసం ముస్లింగా మారిన యువకుడు.. మళ్లీ హిందువు మతంలోకి వచ్చేశాడు!
-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!