Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత టీ20, వన్డే జట్లకు ఎదురైన పరాజయాలపై సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అనూహ్యంగా క్లీన్ స్వీప్ కావడం, అనంతరం ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 3 వరుస పరాజయాలతో సిరీస్ను చేజార్చుకోవడం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ భారత్ ఓటమి పాలైంది. జట్టు ప్రదర్శనలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, మరే ఇతర విషయాల గురించి చర్చించమని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా గతంలో స్పష్టం చేశారు. జులై 19తో ఇంగ్లాండ్ సిరీస్ ముగిసినప్పటికీ, భారత జట్టు ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్ కోసం ఆగస్టు 15న ప్రారంభమయ్యే లంక పర్యటనకు చేరుకుంది. అయినా ఇప్పటివరకు ఈ సమీక్ష సమావేశం జరగలేదు.
ఈ సమీక్ష సమావేశం ఆలస్యం కావడానికి దేవజిత్ సైకియా అస్వస్థతకు గురికావడమే కారణమని సమాచారం. త్వరలోనే ఈ భేటీ జరగనుండగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆన్లైన్ (వర్చువల్) ద్వారా పాల్గొననున్నారు. 2026 టీ20 ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా నియమించిన తర్వాత భారత్ బ్యాక్-టు-బ్యాక్ సిరీస్లను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అలాగే నాలుగో మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
Also Read
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- Trump Secret Flight: ఇరాన్ ముప్పు.. క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ తరలింపు.. అమెరికా రహస్య ఆపరేషన్..
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
అంతకుముందు ఐర్లాండ్పై 2-0తో సిరీస్ ఓడిపోవడం ద్వైపాక్షిక సిరీస్ల చరిత్రలోనే అతిపెద్ద షాక్గా నిలిచింది. అయితే ఈ పరాజయాలపై స్పందించిన దేవజిత్ సైకియా, ఇదొక తాత్కాలికమైన బాడ్ ఫేజ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రికెట్లో జట్టు ప్రదర్శనలో హెచ్చుతగ్గులు సహజమని, బీసీసీఐ జట్టు ప్రదర్శనను నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు. త్వరలోనే జరగబోయే ఈ సమీక్షలో భవిష్యత్తు ప్రణాళికలు, జట్టు సంస్కరణలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
తాజావార్తలు
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!