TDP MLA in Controversy: వివాదంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే
- వివాదం మరో టీడీపీ ఎమ్మెల్యే..
- శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే, ఆయన అనుచరుల హంగామా..
- తమపై దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది..
- ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులపై ఫిర్యాదు..
TDP MLA in Controversy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఇక, టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నా… వార్నింగ్లు ఇస్తున్నా.. కొందరి తీరు మారడం లేదట.. అయితే, తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది..
Read Also: NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
ఆత్మకూరు నుంచి వస్తూ శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి ఆ రహదారిలో విధులకు వెళ్తున్న అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే అడ్డుకున్నారని చెబుతున్నారు.. సున్నిపెంటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళ్తున్న ఫారెస్ట్ డీఆర్వో మురళీ నాయక్, ఫారెస్ట్ గార్డులు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరిముల్లాలను దుర్భాషలాడారని వాపుతున్నారు.. ఆపై ఫారెస్ట్ వాహనాన్ని తానే నడుపుతూ ఫారెస్ట్ సిబ్బందిని కూడా వాహనాల్లో ఎక్కించుకు వెళ్లారట ఎమ్మెల్యే.. తెల్లవారుజామున రెండు గంటల వరకూ వారిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్టుగా తెలుస్తుండగా.. ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు… ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి , ఆయన అనుచరులు తమపై దాడి చేశారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఫారెస్ట్ సిబ్బంది.. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ సిబ్బంది..
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!