CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
- బనగానపల్లెలో సీఎం చంద్రబాబు సభ..
- భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం..
- 29 లక్షల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి..
- ‘ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని హామీ మేరకు రద్దు చేశాం..
- రైతుల సమక్షంలో రీ–సర్వే చేపడుతున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం విధ్వంసమైన రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువచ్చి సుపరిపాలన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత పాలనలో జరిగిన అరాచకాల వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల్లో భయాందోళనలు కలిగించిందని సీఎం వ్యాఖ్యానించారు. మాట వినని వారి భూములను 22ఏ జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ, ఎన్నికల హామీ మేరకు ఆ చట్టాన్ని రద్దు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ భూమి పన్నును రద్దు చేసినట్లే, భూమి హక్కులను రైతులకు మరింత భద్రంగా కల్పిస్తున్నామని చెప్పారు.
భూమి పట్టాలు, సర్వే రాళ్లపై గత పాలకుల ఫొటోలు ముద్రించారని విమర్శించిన చంద్రబాబు, ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తున్నామని వివరించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు గ్రామ సభల ద్వారానే పాసుపుస్తకాల పంపిణీ చేపట్టామని తెలిపారు. గత ఏడు నెలల్లో 29 లక్షల పాసుపుస్తకాలను అందించామని, పంపిణీ ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలలు పట్టవచ్చని చెప్పారు.
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
భూ రికార్డుల పారదర్శకత కోసం బ్లాక్చెయిన్ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు సీఎం వెల్లడించారు. రైతుల సమక్షంలో రీ–సర్వే నిర్వహిస్తూ, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. 1971 రికార్డు ఆఫ్ రైట్స్ను పూర్తిచేయడంతో పాటు తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చేరుకూరులో దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. అలాగే డోన్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో సుమారు రెండు వేల ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
RBI New Rules 2027: 2027 నుంచి RBI న్యూ రూల్స్.. హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIలు ఎలా మారతాయంటే?
-
TTD Hundi Income: శ్రీవారికి కాసుల వర్షం.. హుండీ ఆదాయం సరికొత్త రికార్డు.. మూడేళ్ల తర్వాత..!
-
India All-Time Test XI: భారత్ ఆల్టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
Kannada Stars : యశ్ పాన్ – ఇండియా రేంజ్ని అందుకోలేకపోతున్న కన్నడ స్టార్ హీరోలు
-
Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
ట్రెండింగ్
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
10,000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, IP69 రేటింగ్తో iQOO Z11S వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?