Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuma Akhila Priya: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త భార్గవ్ నాయుడు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ సూచించిందన్న ప్రచారంపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఉంటే ముందుగా తనకే తెలియజేస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి రావడాన్ని అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. బోండా ఉమాను పిలిచిన తర్వాత తనను పిలవడంతోనే అనవసర ప్రచారం జరుగుతోందని అఖిలప్రియ పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ నాయకులతో వేదిక పంచుకోలేదని, ఎలాంటి కాంట్రాక్టర్లను బెదిరించలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్టీ సమావేశంలో జిల్లా సమస్యలు, కార్యకర్తల అంశాలు, సభ్యత్వ కార్యక్రమం, వ్యక్తిగత విషయాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ పిలిచిందంటే ఏదో తప్పు జరిగిందని భావించడం సరికాదన్నారు అఖిలప్రియ.. అహోబిలంలో జరుగుతున్న పరిణామాలపై మీడియా, ప్రజలు దృష్టి సారించాలని అఖిలప్రియ కోరారు. మూడు రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో ఓ మైనర్ బాలికపై దాడి యత్నం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ విషయం మీడియాలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదని అన్నారు. అహోబిలం మఠం పరిధిలో ఉన్నందున అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని, ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని వివరించారు.
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
అహోబిలంలో జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందో స్థానిక ప్రజలను అడిగితే నిజాలు తెలుస్తాయని, తాను చెబితే రాజకీయ రంగు పులుముతారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..
తాజావార్తలు
-
Vishnu Deo Sai: రైతుగా మారిన ముఖ్యమంత్రి.. పొలం దున్నిన విష్ణు దేవ్
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
One Ticket: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన TGSRTC.. ఒక్క టికెట్పైనే ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్లల్లో ప్రయాణం..
-
Allu Arjun: కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్లో హాజరైన అల్లు అర్జున్!
-
Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!