NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు గ్రామ వీఆర్వో నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన సమయంలో, వివాహం అనంతరం నామాల జయమ్మ తన భర్త భాస్కర్తో కలిసి మావోయిస్టు ఉద్యమంలో చేరి అడవిబాట పట్టినట్లు సమాచారం. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోగా, జయమ్మ మాత్రం ఉద్యమాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.
2005లో నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడటంతో జయమ్మ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో జయమ్మ మృతిచెందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఎన్ఐఏ అధికారులు నంద్యాల జిల్లాలో విచారణ చేపట్టి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో జయమ్మ మృతిపై మరోసారి చర్చ మొదలైంది. మృతి చెందినట్లు ప్రచారం జరిగిన తర్వాత కూడా ఎన్ఐఏ విచారణ కొనసాగుతుండటంతో, జయమ్మ నిజంగా మృతిచెందిందా? లేక ఇంకా జీవించి ఉందా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
తాజావార్తలు
-
Earthquake: ఇండోనేషియాలో వరసగా భారీ భూకంపాలు.. అసలు కారణాలేంటి.?
-
CM Revanth Reddy : సెప్టెంబర్లో అసెంబ్లీ సమావేశాలు పెడతా.. కేసీఆర్ను కూడా తీసుకురండి
-
IND Vs SL: మొదటి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్.. రెండో రోజు ముగిసిన ఆట..
-
Visaka Airport: 40 ఏళ్ల నాటి అనుబంధం నేటితో ముగింపు.. భావోద్వేగంతో వీడ్కోలు..
-
CM Revanth Reddy : పరకాలకు సీఎం రేవంత్ వరాలు.. రూ.400 కోట్లకు పైగా అభివృద్ధి పనులు.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?