TDP MLA in Controversy: వివాదంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే
- వివాదం మరో టీడీపీ ఎమ్మెల్యే..
- శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే, ఆయన అనుచరుల హంగామా..
- తమపై దాడి చేశారంటున్న ఫారెస్ట్ సిబ్బంది..
- ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులపై ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP MLA in Controversy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలపై పలు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి.. ఇక, టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.. ఎమ్మెల్యేలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నా… వార్నింగ్లు ఇస్తున్నా.. కొందరి తీరు మారడం లేదట.. అయితే, తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది..
Read Also: NTR Fans : మా హీరో ఏం చేశారు?.. ఏపీలో ప్రెస్ మీట్ పెట్టనివ్వలేదు!
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
ఆత్మకూరు నుంచి వస్తూ శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి ఆ రహదారిలో విధులకు వెళ్తున్న అటవీ శాఖ అధికారులను ఎమ్మెల్యే అడ్డుకున్నారని చెబుతున్నారు.. సున్నిపెంటలోని తమ కార్యాలయం నుంచి విధులకు వెళ్తున్న ఫారెస్ట్ డీఆర్వో మురళీ నాయక్, ఫారెస్ట్ గార్డులు గురవయ్య, మోహన్ కుమార్, డ్రైవర్ కరిముల్లాలను దుర్భాషలాడారని వాపుతున్నారు.. ఆపై ఫారెస్ట్ వాహనాన్ని తానే నడుపుతూ ఫారెస్ట్ సిబ్బందిని కూడా వాహనాల్లో ఎక్కించుకు వెళ్లారట ఎమ్మెల్యే.. తెల్లవారుజామున రెండు గంటల వరకూ వారిని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తిప్పినట్టుగా తెలుస్తుండగా.. ఫారెస్ట్ గార్డ్ గురవయ్యపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని చెబుతున్నారు… ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి , ఆయన అనుచరులు తమపై దాడి చేశారని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఫారెస్ట్ సిబ్బంది.. ఈ వ్యవహారంపై పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు ఫారెస్ట్ సిబ్బంది..
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!