Minister BC Janardhan Reddy: 2 నెలల వ్యవధిలోనే ఆ రోడ్లు పూర్తి చేస్తాం..
- బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన..
- రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ పరిశీలన..
- 2 నెలల వ్యవధిలోనే రోడ్లు పూర్తి చేస్తామని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister BC Janardhan Reddy: బనగానపల్లెలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ దుస్థితిని పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. అయితే, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత లేని పనులు చేశారన్న ఆయన.. 2 నెలల్లో పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లలో గుంతలు లేకుండా , డ్రైనేజీల్లో మురికి నీరు నిలువ లేకుండా చేస్తామని ప్రకటించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్, కరెంట్ ఆఫీస్ ఏరియా, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ల్లో అద్వాన స్థితిలో ఉన్న గుంతలు పడి ఉన్న రోడ్లను, మురికినీటి తో నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.
Read Also: Mayawati: రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి..
Also Read
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
అయితే, గత ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలు లేకుండా చేపట్టిన పనులను లేని ఏ విధంగా అంగీకరించారంటూ ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ అధికారులను, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పలు కాలనీల్లో పర్యటించిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్ల యాక్సిడెంట్లు జరుగు తున్నాయని విమర్శించారు, ఎన్నికల ముందు బనగానపల్లెకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేకుండా.. ఇష్టారాజ్యాంగ పనులు చేశారని.. ఆర్భాటాల కోసం రోడ్లు , సెంట్రల్ లైటింగ్ అంటూ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు నాణ్యత లేని పనులు చేశారని మండిపడ్డారు.. అయితే, 2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని, పట్టణంలో ఎక్కడ కూడా రోడ్ల లో గుంతలు లేకుండా , డ్రైనేజీ ల్లో మురికి నీరు, నిలువ లేకుండా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!