Minister BC Janardhan Reddy: 2 నెలల వ్యవధిలోనే ఆ రోడ్లు పూర్తి చేస్తాం..
- బనగానపల్లెలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పర్యటన..
- రోడ్లు.. డ్రైనేజీ వ్యవస్థ పరిశీలన..
- 2 నెలల వ్యవధిలోనే రోడ్లు పూర్తి చేస్తామని ప్రకటన..
Minister BC Janardhan Reddy: బనగానపల్లెలో అధ్వానంగా ఉన్న రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ దుస్థితిని పరిశీలించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. అయితే, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శించారు.. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత లేని పనులు చేశారన్న ఆయన.. 2 నెలల్లో పట్టణంలో ఎక్కడ కూడా రోడ్లలో గుంతలు లేకుండా , డ్రైనేజీల్లో మురికి నీరు నిలువ లేకుండా చేస్తామని ప్రకటించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని పెట్రోల్ బంక్, కరెంట్ ఆఫీస్ ఏరియా, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ ల్లో అద్వాన స్థితిలో ఉన్న గుంతలు పడి ఉన్న రోడ్లను, మురికినీటి తో నిలిచిపోయిన డ్రైనేజీ వ్యవస్థను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు.
Read Also: Mayawati: రిజర్వేషన్లను రద్దు చేసేందుకు బీజేపీ-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నాయి..
Also Read
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
- Nandyala: వివాహ బంధానికి మాయని మచ్చ.. ప్రియుడి మోజులో పడి ఇల్లాలు ఎంత పని చేసిందంటే..!
- Wife Kills Husband: ప్రియుడి కోసం మెడకు బెల్ట్ బిగించి, బండరాళ్లతో తలపై దాడి చేసి భర్తను హతమార్చిన భార్య..!
అయితే, గత ప్రభుత్వంలో నాణ్యత ప్రమాణాలు లేకుండా చేపట్టిన పనులను లేని ఏ విధంగా అంగీకరించారంటూ ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ అధికారులను, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. పలు కాలనీల్లో పర్యటించిన అనంతరం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వాకం వల్ల యాక్సిడెంట్లు జరుగు తున్నాయని విమర్శించారు, ఎన్నికల ముందు బనగానపల్లెకు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని హడావుడిగా నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం లేకుండా.. ఇష్టారాజ్యాంగ పనులు చేశారని.. ఆర్భాటాల కోసం రోడ్లు , సెంట్రల్ లైటింగ్ అంటూ ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసేందుకు నాణ్యత లేని పనులు చేశారని మండిపడ్డారు.. అయితే, 2 నెలల వ్యవధిలో అసంపూర్తిగా ఉన్న రోడ్ల పనులను పూర్తి చేస్తామని, పట్టణంలో ఎక్కడ కూడా రోడ్ల లో గుంతలు లేకుండా , డ్రైనేజీ ల్లో మురికి నీరు, నిలువ లేకుండా చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని వెల్లడించారు. త్వరలోనే రూ.3 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణ పనులు చేపడతామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!