సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో మహా శివరాత్రి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్లలో దర్శనానికి పంపించాలని అధికారులకు సూచించారు. మంత్రి పొన్నం ఆలయంలోని భక్తులతో ముచ్చటించి.. అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్లో హెల్త్ చెకప్ చెపించుకున్నారు. దర్శనం అనంతరం…
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి సందర్భంగా…
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి అమ్మ వార్లకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.. ఇందిరమ్మ దంపతులు దర్శించుకున్నారు.. యాగంటి ఆలయ క్షేత్రానికి చేరుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి - ఇందిరమ్మ దంపతులకు ఆలయం మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు,
తెలంగాణ రాష్ట్ర ప్రజలు సబీక్షంగా ఉండాలని, ప్రపంచంలో తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఆ శివపార్వతులను వేడుకున్నట్టు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా బుధవారం ఆయన శ్రీమతి మల్లు నందినితో కలిసి స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మిపురంలోని పురాతన శివాలయంలో, మధిర నియోజకవర్గ కేంద్రంలోని శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహా శివరాత్రి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ…
శ్రీశైలంలో మహాశివరాత్రి పర్వదినం కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు.. సాయంకాలం శ్రీస్వామి అమ్మవార్లకు నందివాహనసేవ, ఆలయ ఉత్సవం నిర్వహించనున్నారు.. రాత్రి 10 గంటలకు లింగోద్బవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీస్వామివారికి పాగలంకరణ ఉండగా.. రాత్రి 12 గంటలకు పార్వతి పరమేశ్వరుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. శివుడిని దర్శించుకునేందుకు తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాళేశ్వరం, వేములవాడ, కీసర తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోతోంది. భక్తులు స్వామివారికి కోడె మొక్కలు చెల్లించి.. దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
మహా శివరాత్రి వేళ శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. హిందువుల ముఖ్యపండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు రెడీ అవుతున్నారు. శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి, బాధలు తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి…
మహా శివరాత్రి ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. పరమ శివున్ని ప్రసన్నం చేసుకునేందుకు శివయ్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే శివాలయాలను పూలు, మామిడాకుల తోరణాలతో ముస్తాబు చేస్తున్నారు. మహా శివరాత్రి వేళ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగనున్నాయి. భక్తులు ఉపవాసాలు, జాగారాలతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు శివయ్యపై తమ భక్తిని వినూత్నరీతిలో చాటుకుంటున్నారు. ఇదే రీతిలో గుజరాత్ లోని భక్తులు శివలింగాన్ని రుద్రాక్షలతో రూపొందించారు. వందలు,వేలు కాదు ఏకంగా…
Maha Shivratri 2025: హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో క్రిష్ణ పక్ష చతుర్దశి తిధినాడు మహా శివరాత్రి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజు లింగ రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అంతేకాకుండా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పేర్కొనబడింది. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది. అయితే, మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన…
Minister Anam: శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. ఈనెల 25, 26 రెండు రోజులు శ్రీశైలం టోల్ గేట్లు ఉచితం చేస్తాం..