CM Chandrababu: సున్నిపెంటలో ప్రజా వేదిక సభ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- శ్రీశైలంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన..
- మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎం..
- శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. కృష్ణా నదికి నది హారతి ఇచ్చిన చంద్రబాబు.. సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. కృష్ణా నదికి నది హారతి ఇచ్చారు.. అనంతరం సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని చెప్పిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాయలసీమలో పనికిరాని పార్టీకి 7 సీట్లు గెలిపించారు.. ఎక్కడో చిన్న లోపం ఉంది అన్నారు.
Read Also: IND vs SL ODI Series: హాట్స్టార్, జియోసినిమాలో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే?
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
ఇక, టీడీపీ హయాంలో 60 వేల కోట్లు ఖర్చు చేసాం.. కానీ, వైసీపీ హయాంలో 19 వేల కోట్లు ఖర్చు పెట్టారు అని విమర్శించారు చంద్రబాబు.. రాయలసీమలో మేం 12 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేశారు.. ఎవరి నుంచి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందో గుర్తించాలని సూచించారు. వైసీపీ హయాంలో భయంతో బతికారు.. స్వేచ్ఛ లేదన్న ఆయన.. ఇప్పుడు ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ వచ్చింది.. సునామిలో వాళ్లు చిత్తు చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.. ఎన్నో హామీలు ఇచ్చాను.. నెరవేర్చాలి, ఖజానా ఖాళీగా ఉంది.. 2, 3 రోజుల్లో నాగార్జున సాగర్ నిండుతుంది, పులిచింతల కూడా నిండుతుందన్నారు. రాబోయే ఐదేళ్లు కరువు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలి.. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ.. కొందరు పాలకుల వల్ల రాళ్లసీమగా మారింది.. తిరిగి రతనాల సీమగా మారుస్తా అన్నారు.
Read Also: SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ
మరోవైపు.. అన్ని పనులు చేస్తుంటే కొత్త బిక్షగాడు వచ్చాడు, ఏదో చేస్తాడని ఓట్లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు చంద్రబాబు.. అడవి పందులు పంటలను తిని ధ్వంసం చేసినట్టు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు.. అయితే, సంపద సృష్టించడంలో టీడీపీ ముందుంటుంది.. సంపద సృష్టిస్తా.. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరవేస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Krishna Janmashtami : కృష్ణాష్టమి రోజు ఈ మంత్రాలు జపిస్తే.. కృష్ణుడి అనుగ్రహం..!
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!