Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Released Varahi Yatra Poster: గుంటూరులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం వారాహి యాత్ర పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహి యాత్రను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల్ని కలిసేలా ప్రణాళిక రచించినట్టు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్ వారాహి యాత్ర కొనసాగనుందని.. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గతంలో 2 వేల అర్జీలను తాము అధికారులకు పంపామని, మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని అన్నారు.
Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్.. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను తెలియజేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్.. జగననన్న పాపం పథకంగా మారిందని ఆరోపించారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తు తగ్గించారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 17,140 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించారని స్వయంగా కేంద్రమే చెప్పిందని చెప్పారు. ఎప్పుడూ లేనంతగా.. సీఎం జగన్ ఇప్పుడే హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 14 వేల మంది నిర్వాసితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ డ్యామేజికి కారణం ఏమిటి? అవినీతా, నాణ్యతా లోపమా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..