Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy Reacts On Anam Venkata Ramana Reddy Issue: టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డిపై దాడికి జరిగిన యత్నంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని.. వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఏం జరిగినా.. దాన్ని వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారిందని ఫైర్ అయ్యారు. ఇక్కడున్న నటులు కాకుండా, కొందరు నటులను దిగుమతి చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. వాళ్లలో దేవినేని ఉమా ఒకరని, ఆయన నెల్లూరుకు వచ్చి హడావిడి చేశారని అన్నారు. గత ఎన్నికల్లో మంత్రి ఉన్న దేవినేని ఉమా ఓటమి పాలయ్యారని, ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. దాడికి యత్నం జరిగిందని చెబుతున్న ఆనం పోలీసులకు ఫిర్యాదు చేయనని చెప్పారని.. తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఏరిపారేస్తామని బెదిరించారని, ఎవరు రౌడీయిజం చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy: అధికారం కోసం పొత్తులు పెట్టుకోవటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
Also Read
- Daggubati Purandeswari: 2024 ఫార్ములానే స్థానిక ఎన్నికల్లోనూ.. పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ఆ దాడి వ్యవహారంలో పోలీసులు పలుమార్లు వెళ్తే.. రాత్రి సమయంలో ఆనం ఫిర్యాదు చేశారని కాకాణి తెలిపారు. పోలీసులు వెళ్లి అడిగితే కంప్లైంట్ ఇచ్చే దిక్కులేదని కౌంటర్ వేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఇలాంటి దాడులను ముఖ్యమంత్రి జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా ప్రోత్సహించబోరని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలే పలు అనుమానాలకు దారి తీస్తున్నాయన్నారు. టీడీపీ నేతల వ్యవహార శైలి చూస్తుంటే.. బురదజల్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపిస్తోందన్నారు. లోకేష్ త్వరలో జిల్లాలో పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో.. సెన్సేషన్ కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. లోకేష్ పాదయాత్ర అన్ని చోట్లా విఫలమైందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన దేవినేని ఉమా.. వచ్చే ఎన్నికల ఫలితాల గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు కుప్పంలో ఓడిపోతారని జోస్యం చెప్పారు.
Wives Eloped With Lovers: భర్తల్ని పని కోసం విదేశాలకు పంపి.. లవర్లతో భార్యలు జంప్
తాజావార్తలు
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
-
Mark Zuckerberg: జుకర్బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
-
US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..