Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alluri District Tribal Bandh: ఆదివాసీల బంద్ తో అల్లూరి సీతారామరాజు జిల్లా స్తంభించింది. వ్యాపార, పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. GO నెం.3 కి ప్రత్యామ్నాయం, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయడం, బాక్సైట్ తవ్వకా లు, హైడ్రో పవర్ ప్లాంట్స్ అనుమతులు రద్దు ప్రధాన డిమాండ్ల సాధన కోసం
ఈ బంద్ సాగుతోంది.
అందిన సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీల బందులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాడేరులో ఆర్టీసి డిపో ఎదుట బయటాయించిన ఆదివాసిలని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పోలీసులతో ఆదివాసి జేఎసి నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు పోలీసులు ఆదివాసి జేఎసి నేతల మధ్య తోపులాట జరిగింది. ఆదివాసి జేఏసి బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాడేరులో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని 11 మండలాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వాహనాల్ని ముమ్మరంగా తనికీ చేస్తున్నారు.
Also Read
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- 1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేనందున ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలకు సిద్ధమని అధికార యంతరంగం ప్రకటించడంతో ఆదివాసి సంఘాల బంద్ కాస్త ఉదృతంగా కొనసాగుతుంది. న్యాయ సమీక్షలో రద్దైన జీఓ నెంబర్ మూడుని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసి సంఘాల నేతలు. 1/70 యాక్ట్ ద్వారా భూ బదలయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బాక్సెట్ తవ్వకాలకు అనుమతులు నిలిపి వేయాలని, అల్లూరు జిల్లాను జోన్ 1లో ఉంచాలని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదివాసి జేఎసి బందుకు వైసపి వామపక్ష పార్టీలు వర్తక వ్యాపార సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందు ప్రభావంతో పర్యాటక కేంద్రం అరకు వ్యాలీ మూతబడింది. టెట్ ఎగ్జామ్స్ కారణంగా ఉదయం 10 గంటల వరకు బస్సుల రాకపోకలకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆదివాసి జేఎస్సి ప్రకటించింది.
తాజావార్తలు
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!