Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alluri District Tribal Bandh: ఆదివాసీల బంద్ తో అల్లూరి సీతారామరాజు జిల్లా స్తంభించింది. వ్యాపార, పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. GO నెం.3 కి ప్రత్యామ్నాయం, 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయడం, బాక్సైట్ తవ్వకా లు, హైడ్రో పవర్ ప్లాంట్స్ అనుమతులు రద్దు ప్రధాన డిమాండ్ల సాధన కోసం
ఈ బంద్ సాగుతోంది.
అందిన సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆదివాసీల బందులో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాడేరులో ఆర్టీసి డిపో ఎదుట బయటాయించిన ఆదివాసిలని పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించారు. దీంతో పోలీసులతో ఆదివాసి జేఎసి నేతలు వాగ్వాదానికి దిగారు. కాసేపు పోలీసులు ఆదివాసి జేఎసి నేతల మధ్య తోపులాట జరిగింది. ఆదివాసి జేఏసి బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పాడేరులో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఏజెన్సీలోని 11 మండల కేంద్రాల్లో బందు ప్రశాంతంగా కొనసాగుతుంది. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని 11 మండలాల్లో భారీగా పోలీసులు మోహరించారు. వాహనాల్ని ముమ్మరంగా తనికీ చేస్తున్నారు.
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేనందున ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలకు సిద్ధమని అధికార యంతరంగం ప్రకటించడంతో ఆదివాసి సంఘాల బంద్ కాస్త ఉదృతంగా కొనసాగుతుంది. న్యాయ సమీక్షలో రద్దైన జీఓ నెంబర్ మూడుని పునరుద్ధరిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసి సంఘాల నేతలు. 1/70 యాక్ట్ ద్వారా భూ బదలయింపు చట్టం పటిష్టంగా అమలు చేయాలని హైడ్రో పవర్ ప్రాజెక్టులకు అనుమతులు రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. బాక్సెట్ తవ్వకాలకు అనుమతులు నిలిపి వేయాలని, అల్లూరు జిల్లాను జోన్ 1లో ఉంచాలని ఆదివాసీలు ఆందోళన చేస్తున్నారు. ఆదివాసి జేఎసి బందుకు వైసపి వామపక్ష పార్టీలు వర్తక వ్యాపార సంఘాలు మద్దతు ప్రకటించాయి. బందు ప్రభావంతో పర్యాటక కేంద్రం అరకు వ్యాలీ మూతబడింది. టెట్ ఎగ్జామ్స్ కారణంగా ఉదయం 10 గంటల వరకు బస్సుల రాకపోకలకు మినహాయింపు ఇస్తున్నట్టు ఆదివాసి జేఎస్సి ప్రకటించింది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!