ఏపీ శాసనమండలి ఛైర్మన్ మోషేన్రాజు రాజకీయ ప్రస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ శాసనమండలి నూతన ఛైర్మన్గా మోషేన్రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండలిలో ఛైర్ వద్దకు మోషేన్ రాజును జగన్ తీసుకువెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మోషేన్రాజు నిబద్ధత గల రాజకీయ నాయకుడు అని సీఎం జగన్ అభినందించారు. అనంతరం మోషేన్రాజుకు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు.
Read Also: కుటుంబ సభ్యులను కించపరచటం తగదు: పవన్ కళ్యాణ్
Also Read
1965, ఏప్రిల్ 10న పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని గునుపూడిలో కొయ్యే సుందరరావు, మరియమ్మ దంపతులకు మోషేన్ రాజు జన్మించారు. డిగ్రీ అభ్యసించిన తర్వాత రాజకీయరంగప్రవేశం చేశారు. 1987 నుంచి వరుసగా నాలుగుసార్లు మున్సిపల్ కౌన్సిలర్గా, రెండుసార్లు ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. పీసీసీ ఎస్సీ, ఎస్టీ సెల్ ప్రత్యేక ఆహ్వానితుడిగా, కాంగ్రెస్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీకి మోషేన్ రాజు సేవలను గుర్తించిన సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీ చేశారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!