Botsa Satyanarayana:విపక్షాల్ని పట్టించుకోవద్దు… అభివృద్ధి చేసుకుపోదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు గతంలోకంటే బాగా అమలు అవుతున్నాయని, విపక్షాల విమర్శల్ని అసలు పట్టించుకోవద్దన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నాయకులు ఎన్నైనా మాట్లాడుతారు. సమాధానం మనం చేసే పని కార్యక్రమాలు ఉండాలి. మూడు సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి… తండ్రి తనయులు జిల్లాకి చేసిన అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువే అని చెప్పగలం. ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతారు… పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స.
ప్లీనరీ అయిన తరువాత నియోజకవర్గం స్థాయిలో శ్వేత పత్రం విడుదల చేస్తాం. సంక్షేమ కోసం అయిదు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చాం. రాబోయే రెండేళ్లలో మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. ఈ డబ్బు ఇస్తోంది పేదవాడి స్థితి గతులు మారాలని. అవి ఊరకనే ఇవ్వడం లేదు. బాబొస్తే జాబొస్తాదని చెప్పారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తురువాత వ్యవస్థలను స్థాపించారు…. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అప్పడు పచ్చ చొక్కాలు వేసుకునే వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అర్హత ఉంటే చాలు వారికి లబ్ధి చేకూరుతుంది.ఎక్కడా దళారులు లేకుండా పథకాల అమలు విజయవంతంగా సాగుతోందన్నారు.
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
BJP: ఏపీ సీఎం జగన్కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి
హుద్ హుద్ తుఫాన్ వచ్చిన రెండు రోజుల వరకూ విశాఖలో నీళ్లు రాలేదు. బస్సులో పడుకుంటే ఏంటీ ఇంట్లో పడుకుంటే ఏంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, కరెంటు అందాలి… ఇది చేయలేకపోయారు. మైండ్ డైవర్సన్స్ వస్తున్నాయి.. జాగ్రత్త పడండి.. మారండి. జిల్లాకు రాజకీయంగా మంచి పేరుంది… ఇక్కడ నిర్ణయాలు రాష్ట్ర పార్టీలో మార్పులు చేసే వారు. మూడు నెలలకు జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహించాలి. తప్పు జరిగితే సమర్ధించ కూడదు… సమస్య వినాలి సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు మంత్రి బొత్స.
చంద్రబాబు మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. నేడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది… నిధులు కేటాయించారు… వచ్చే ఏడాదికి మెడికల్ స్టూడెంట్స్ వస్తారు… ఇది వాస్తవం. తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్టు అశోక్ వద్దంటారు. ఏంటో మరి? 16 వేల కోట్ల రూపాయలు స్కూల్ లో మౌలిక వసతుల కోసం ఖర్చుపెట్టాం. 35 లక్షల మందికి బైజూస్ ద్వారా ఫ్రీగా క్లాసులు చెప్పబోతున్నారు. జిల్లా మీదుగా వెయ్యి కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్నాయి. భూసేకరణకు చాలా ఇబ్బంది అవుతున్నా… మా ప్రతినిధులతో రైతుకు చెప్పగలుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు బాగా చేస్తారో వాళ్లనే ఎన్నుకుంటారు.. గౌరవం అందిస్తారు అన్నారు మంత్రి బొత్స.
BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..
తాజావార్తలు
-
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!