Botsa Satyanarayana:విపక్షాల్ని పట్టించుకోవద్దు… అభివృద్ధి చేసుకుపోదాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు గతంలోకంటే బాగా అమలు అవుతున్నాయని, విపక్షాల విమర్శల్ని అసలు పట్టించుకోవద్దన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ నాయకులు ఎన్నైనా మాట్లాడుతారు. సమాధానం మనం చేసే పని కార్యక్రమాలు ఉండాలి. మూడు సంవత్సరాలు అయ్యింది అధికారంలోకి వచ్చి… తండ్రి తనయులు జిల్లాకి చేసిన అభివృద్ధి పనులు టీడీపీ ప్రభుత్వం కంటే ఎక్కువే అని చెప్పగలం. ప్రతిపక్షాలు ఏదేదో మాట్లాడుతారు… పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు మంత్రి బొత్స.
ప్లీనరీ అయిన తరువాత నియోజకవర్గం స్థాయిలో శ్వేత పత్రం విడుదల చేస్తాం. సంక్షేమ కోసం అయిదు వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చాం. రాబోయే రెండేళ్లలో మరో రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వనున్నాం. ఈ డబ్బు ఇస్తోంది పేదవాడి స్థితి గతులు మారాలని. అవి ఊరకనే ఇవ్వడం లేదు. బాబొస్తే జాబొస్తాదని చెప్పారు మరి ఎందుకు ఇవ్వలేకపోయారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తురువాత వ్యవస్థలను స్థాపించారు…. చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అప్పడు పచ్చ చొక్కాలు వేసుకునే వారికే వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… అర్హత ఉంటే చాలు వారికి లబ్ధి చేకూరుతుంది.ఎక్కడా దళారులు లేకుండా పథకాల అమలు విజయవంతంగా సాగుతోందన్నారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
BJP: ఏపీ సీఎం జగన్కు జీవీఎల్ సవాల్.. అంత ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేయండి
హుద్ హుద్ తుఫాన్ వచ్చిన రెండు రోజుల వరకూ విశాఖలో నీళ్లు రాలేదు. బస్సులో పడుకుంటే ఏంటీ ఇంట్లో పడుకుంటే ఏంటి? ప్రజలకు నీళ్లు ఇవ్వాలి, కరెంటు అందాలి… ఇది చేయలేకపోయారు. మైండ్ డైవర్సన్స్ వస్తున్నాయి.. జాగ్రత్త పడండి.. మారండి. జిల్లాకు రాజకీయంగా మంచి పేరుంది… ఇక్కడ నిర్ణయాలు రాష్ట్ర పార్టీలో మార్పులు చేసే వారు. మూడు నెలలకు జిల్లా పార్టీ సమావేశాలు నిర్వహించాలి. తప్పు జరిగితే సమర్ధించ కూడదు… సమస్య వినాలి సరిదిద్దే ప్రయత్నం చేయాలన్నారు మంత్రి బొత్స.
చంద్రబాబు మెడికల్ కాలేజీ ఇచ్చామన్నారు. నేడు మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంది… నిధులు కేటాయించారు… వచ్చే ఏడాదికి మెడికల్ స్టూడెంట్స్ వస్తారు… ఇది వాస్తవం. తారకరామ తీర్ధ సాగర్ ప్రాజెక్టు అశోక్ వద్దంటారు. ఏంటో మరి? 16 వేల కోట్ల రూపాయలు స్కూల్ లో మౌలిక వసతుల కోసం ఖర్చుపెట్టాం. 35 లక్షల మందికి బైజూస్ ద్వారా ఫ్రీగా క్లాసులు చెప్పబోతున్నారు. జిల్లా మీదుగా వెయ్యి కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం సాగుతున్నాయి. భూసేకరణకు చాలా ఇబ్బంది అవుతున్నా… మా ప్రతినిధులతో రైతుకు చెప్పగలుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరు బాగా చేస్తారో వాళ్లనే ఎన్నుకుంటారు.. గౌరవం అందిస్తారు అన్నారు మంత్రి బొత్స.
BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!