BJP National Executive Meeting: ప్రధాని మోడీ రాక.. సిటీలో హోర్డింగుల కాక..
ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు రేపు హైదరాబాద్ రానున్న నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోర్డింగుల వార్ నడుస్తోంది. మోడీ రాకను వ్యతిరేకిస్తూ గులాబీ పార్టీవాళ్లు క్రియేటివ్గా హోర్డింగులను ఏర్పాటుచేస్తున్నారు. ‘సాలు మోడీ.. సంపకు మోడీ’ అని రాసి ఉన్న బ్యానర్లను, హోర్డింగ్లు ఇప్పటికే నగరంలోని పలు చోట్ల ఏర్పాటు చేశాయి.. ఇది హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఫ్లెక్సీలే దర్శనమిచ్చాయి. అయితే, వాటిని వెంటనే అధికారులు, సిబ్బంది తొలగించారు.
Read Also: Electric Vehicle: ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్న్యూస్.. గ్రేటర్లో పబ్లిక్ ఛార్జింగ్ సెంటర్లు..!
Also Read
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
తాజాగా హైదరాబాద్లో ప్రదర్శించిన ఓ హోర్డింగులో ప్రధాని మోడీని ఇంకా హార్డ్గా టార్గెట్ చేశారు. దొంగల ముఠా ఫొటో పెట్టి దానిపై ‘మిస్టర్ ఎన్.మోడీ.. మేం బ్యాంక్లను మాత్రమే దోచేస్తాం.. కానీ, మీరు ఈ దేశాన్ని మొత్తాన్ని దోచేస్తారు.. అని రాశారు. అయితే, ఈ భారీ ఫ్లెక్సీలను ఎవరు పెట్టారో తెలియదు.. కానీ, పెద్ద చర్చగా మారాయి.. దీంతో, వెంటనే వాటిని తొలగించారు అధికారులు.
కాగా, తెలంగాణలో సీఎం కేసీఆర్, ఆయన మంత్రులు ఆలీబాబా 40 దొంగల ముఠాలా తయారయ్యారంటూ కమలదళం రెండు రోజుల కిందట ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ పాలనకు రాష్ట్ర ప్రజలు రాంరాం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని కూడా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిస్తూ ‘చాలు దొర.. సెలవు దొర’ అనే పేరుతో టీ-బీజేపీ ఒక ప్రత్యేక వెబ్ సైట్ను ప్రారంభించింది. దీంతో టీఆర్ఎస్ పార్టీ కూడా సరిగ్గా అవే వ్యాఖ్యలతో బీజేపీ విమర్శలను తిప్పకొడుతోంది.
ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను కూడా ఆలీబాబా దొంగల ముఠాతో పోల్చుతూ లేటెస్టుగా హోర్డింగ్ పెట్టారు. ఆ ప్రచార చిత్రంపైన అధికారికంగా టీఆర్ఎస్ పార్టీ పేరు లేనప్పటికీ అది ఆ పార్టీవాళ్ల పనేనని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదంటూ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
-
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికలు.. మే 4న కేవలం 293 స్థానాలకు మాత్రమే ఓట్ల లెక్కింపు.. కారణం ఏమిటి?
-
Batchmates Web Series :మళ్ళీ కాలేజ్ రోజుల్లోకి.. ‘బ్యాచ్మేట్స్’ సిరీస్ రివ్యూ
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. ముందున్న కఠినమైన సవాళ్లు ఇవే!
-
Delhi Fire Tragedy: ఢిల్లీలోని వివేక్ విహార్లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!