Merugu Nagarjuna: చంద్రబాబు పార్టీ శవపేటికలా ఉంది.. మంత్రి నాగార్జున ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Merugu Nagarjuna Counters On Chandrababu Naidu Manifesto: టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ఇప్పుడు శవ పేటికలా మారిందంటూ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పేదలకు సెంటు ఇళ్లు, ఇంగ్లీషు విద్య ఇస్తుంటే.. చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే.. ఒక్క సంక్షేమ పథకం కూడా పెట్టలేదని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలను.. తన వాళ్లకు రాబందుల్లాగా తినడానికి పెట్టారంటూ ఆరోపించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. బీసీల తోక కత్తిరిస్తాను అన్నాడని, ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటారని చెప్పాడని గుర్తు చేశారు. 2014లో 650 వాగ్దానాలు మేనిఫెస్టెలో పెట్టావ్, ఎన్ని అమలు చేశావో చెప్ప అంటూ చంద్రబాబుని నిలదీశారు. అందులో 10 శాతం వాగ్దానాలైన అమలు చేశావా? అని ప్రశ్నించారు. 2 లక్షల 80 కోట్ల రూపాయలను డీపీటీ రూపంలో పేదలకు పైసా లంచం లేకుండా అందజేశామని తెలియజేశారు. పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను స్మశానంతో పోల్చిన నీచుడు చంద్రబాబు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే.. ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ తీసేస్తారని పేర్కొన్నారు.
Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని చంద్రబాబు.. రాష్ట్రంలోని పేదలందరిని ధనికులుగా మారుస్తానంటే ఎవరు నమ్ముతారని మంత్రి నాగార్జున విరుచుకుపడ్డారు. అమ్మకు అన్నం పెట్టడు కానీ, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాననే చందంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు కాపీ అని విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్నన ‘అమ్మకు ఒడి’ పథకాన్ని.. అమ్మకు వందనం పేరుతో కాపీ కొట్టారని తూర్పారపట్టారు. పూర్ టు రిచ్ అనే కార్యక్రమం చంద్రబాబుకు తన 75 ఏళ్ల వయసులో గుర్తొచ్చిందా అని నిలదీశారు. సరికొత్త వాగ్దానాలు చేయడం, నాటకాలు ఆడటం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఏనాడూ తాను ప్రకటించిన మేనిఫెస్టోని అమలు చేయలేదని పేర్కొన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు పేరు చెబితే.. ఏ పథకమూ గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు.
Meta Layoff: ఉద్యోగం కోసం ఇండియా నుంచి యూకేకి.. 2 నెలలకే జాబ్ నుంచి పీకి పారేశారు..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!