Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్కు మూడినట్లే..
- పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ముదిరిన యుద్ధం..
- సూసైడ్ స్వ్కాడ్స్ సిద్ధం చేస్తున్న తాలిబాన్లు..
- పాక్పై ప్రతీకార దాడులకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ స్వ్కాడ్’’లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్లను ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు పేలుడు దుస్తులు, కార్ బాంబులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, పాక్టియా, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ – పాకిస్తాన్ సరిహద్దు, వివిధ ప్రాంతాలలో తీవ్రమైన దాడి, ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read
- Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
- Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
- Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!
పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. 133 ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు మరణించారని మరియు 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులు ధ్వంసమయ్యాయని మరియు తొమ్మిది మంది పట్టుబడ్డారని పాకిస్తాన్ తెలిపింది. అయితే, 55 పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 పోస్టులు స్వాధీనం చేసుకున్నారని తాలిబాన్ పేర్కొంది, నంగర్హార్లో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించారని తాలిబాన్ పేర్కొంది.
ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ‘‘బహిరంగ యుద్ధ ప్రకటన’’ చేసింది. పాకిస్తాన్ లోపల దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశం ఆరోపిస్తోంది. దీనికి తోడు రెండు దేశాల సరిహద్దు వివాదమైన ‘‘డ్యూరాండ్ లైన్’’ కూడా ఘర్షణకు కారణమవుతోంది. డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ శతాబ్ధకాలంగా ఒప్పుకోవడం లేదు. పాక్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చాలా ప్రాంతాలు తమవే అని చెప్పుకుంటోంది.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!