Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్కు మూడినట్లే..
- పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ముదిరిన యుద్ధం..
- సూసైడ్ స్వ్కాడ్స్ సిద్ధం చేస్తున్న తాలిబాన్లు..
- పాక్పై ప్రతీకార దాడులకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ స్వ్కాడ్’’లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్లను ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు పేలుడు దుస్తులు, కార్ బాంబులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, పాక్టియా, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ – పాకిస్తాన్ సరిహద్దు, వివిధ ప్రాంతాలలో తీవ్రమైన దాడి, ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!
పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. 133 ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు మరణించారని మరియు 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులు ధ్వంసమయ్యాయని మరియు తొమ్మిది మంది పట్టుబడ్డారని పాకిస్తాన్ తెలిపింది. అయితే, 55 పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 పోస్టులు స్వాధీనం చేసుకున్నారని తాలిబాన్ పేర్కొంది, నంగర్హార్లో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించారని తాలిబాన్ పేర్కొంది.
ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ‘‘బహిరంగ యుద్ధ ప్రకటన’’ చేసింది. పాకిస్తాన్ లోపల దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశం ఆరోపిస్తోంది. దీనికి తోడు రెండు దేశాల సరిహద్దు వివాదమైన ‘‘డ్యూరాండ్ లైన్’’ కూడా ఘర్షణకు కారణమవుతోంది. డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ శతాబ్ధకాలంగా ఒప్పుకోవడం లేదు. పాక్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చాలా ప్రాంతాలు తమవే అని చెప్పుకుంటోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!