Pakistan Afghanistan War: “సూసైడ్ స్వ్కాడ్” సిద్ధం చేసిన తాలిబాన్లు.. పాకిస్తాన్కు మూడినట్లే..
- పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ముదిరిన యుద్ధం..
- సూసైడ్ స్వ్కాడ్స్ సిద్ధం చేస్తున్న తాలిబాన్లు..
- పాక్పై ప్రతీకార దాడులకు సిద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం భీకరంగా మారింది. ఈ రోజు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్తో సహా పలు నగరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల తర్వాత తాలిబాన్ల నుంచి ప్రతీకార దాడులు మొదలయ్యాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని ఘర్షణలు తీవ్రమయ్యాయి. పాకిస్తాన్లోని పలు ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాలిబాన్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడే ‘‘సూసైడ్ స్వ్కాడ్’’లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక మీడియా ఆత్మాహుతి దాడులు చేసే బెటాలియన్లను ఫోటోలను షేర్ చేసింది. బాంబర్లు పేలుడు దుస్తులు, కార్ బాంబులతో సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. తాలిబాన్ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్, పాక్టియా, పాక్టికా, ఖోస్ట్ ప్రావిన్సులలో డ్యూరాండ్ లైన్ – పాకిస్తాన్ సరిహద్దు, వివిధ ప్రాంతాలలో తీవ్రమైన దాడి, ప్రతీకార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Also Read
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
Read Also: Virat Kohli: సచిన్ vs విరాట్.. ఇద్దరిలో ఎవరు బెస్టో చెప్పేసిన కోహ్లీ!
పాక్ ఆఫ్ఘాన్ ఘర్షణల్లో వందలాది మంది మరణించినట్లు రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. 133 ఆఫ్ఘన్ తాలిబాన్ యోధులు మరణించారని మరియు 200 మందికి పైగా గాయపడ్డారని, 27 పోస్టులు ధ్వంసమయ్యాయని మరియు తొమ్మిది మంది పట్టుబడ్డారని పాకిస్తాన్ తెలిపింది. అయితే, 55 పాకిస్తాన్ సైనికులు మరణించారని, 19 పోస్టులు స్వాధీనం చేసుకున్నారని తాలిబాన్ పేర్కొంది, నంగర్హార్లో ఎనిమిది మంది ఆఫ్ఘన్ యోధులు మరణించారని తాలిబాన్ పేర్కొంది.
ఇప్పటికే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై ‘‘బహిరంగ యుద్ధ ప్రకటన’’ చేసింది. పాకిస్తాన్ లోపల దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘాన్ ఆశ్రయం ఇస్తుందని ఆ దేశం ఆరోపిస్తోంది. దీనికి తోడు రెండు దేశాల సరిహద్దు వివాదమైన ‘‘డ్యూరాండ్ లైన్’’ కూడా ఘర్షణకు కారణమవుతోంది. డ్యూరాండ్ లైన్ను ఆఫ్ఘనిస్తాన్ శతాబ్ధకాలంగా ఒప్పుకోవడం లేదు. పాక్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చాలా ప్రాంతాలు తమవే అని చెప్పుకుంటోంది.
తాజావార్తలు
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
-
Pawan Kalyan : ఒక్కడిగా మొదలై.. లక్షలాది మంది సైన్యంగా.. జనసేన విస్తరణపై పవన్ కీలక వ్యాఖ్యలు.!
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!