Gudivada Amarnath: చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు మాకు లేదు.. అమర్నాథ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath Counters On Chandrababu Naidu Manifesto: ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పే అలవాటు తమకు లేదని.. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని కౌంటర్ వేశారు. రామాయపట్నం పోర్టు పనులు చూస్తే, ఎవరికైనా అర్థం అవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని రామయపట్నం పోర్టుని సందర్శించిన అనంతరం మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభించి ఏడాది గడవక ముందే 70 శాతం పూర్తయ్యాయని తెలిపారు. సీఎం జగన్ చెప్పిన విధంగా.. పోర్టు మొదటి దశ పనులను డిసెంబర్ నాటికి ప్రారంభిస్తామని అన్నారు. చంద్రబాబు వేసిన శంకుస్థాపన రాళ్లతో.. పోర్టు బ్రేక్స్టోన్స్ వేయొచ్చని సెటైర్లు వేశారు. చంద్రబాబు పనులేమీ చేయకుండా.. రాష్ట్రం మొత్తం కేవలం రాళ్లు వేసుకుంటూ పోయారని ఎద్దేవా చేశారు. పోర్టుతో పాటు ఆధారిత పరిశ్రమల కోసం ఐదు వేల ఎకరాల భూమిని సేకరిస్తామని.. ఈ పోర్టు వల్ల 25 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. అభివృద్ధి చేయలేదని చెప్పే వాళ్లకు.. ఈ పోర్టు పనులు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
Yasin Malik: యాసిన్ మాలిక్ ఉరిశిక్ష కోసం ఎన్ఐఏ అభ్యర్థన.. నోటీసులు జారీ చేసిన ఢిల్లీ కోర్టు..
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
అంతకుముందు.. చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై కూడా మంత్రి అమర్నాథ్ విసుర్లు విసిరారు. అసలు మేనిఫెస్టో అంటే చంద్రబాబుకు అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే చరిత్ర చంద్రబాబుకు ఉందా? 2014 మేనిఫెస్టో ఎక్కడుందో చంద్రబాబుకైనా తెలుసా? అంటూ నిలదీశారు. పక్క రాష్ట్రాల నుండి కాపీ కొట్టి.. మేనిఫెస్టోనీ విడుదల చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఫేజ్ వన్లో ఉచితాలు ఇస్తానన్న చంద్రబాబు.. ఫేజ్ టూలో కిలో బంగారం కూడా ఇస్తానంటాడని ఎద్దేవా చేశారు. కేవలం తన మనుషుల్ని మాత్రమే చంద్రబాబు ‘పూర్ టు రిచ్’ చేస్తాడని.. చంద్రబాబు అధికారంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, లింగమనేని, లోకేష్ లాంటి వాళ్లే ధనికులు అయ్యారని చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లలోనే సీఎం జగన్ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు అంటూ చంద్రబాబు యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డాడు. చంద్రబాబు ఎన్ని చెప్పినా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి అమర్నాథ్ తేల్చి చెప్పారు.
Delhi Incident: ఢిల్లీలో 16 ఏళ్ల బాలిక హత్య.. యూపీలో పట్టుబడిన నిందితుడు..
తాజావార్తలు
-
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
-
MS Dhoni: ‘తలా ఫర్ ఏ రీజన్.!’ CSK మ్యాచ్ ఓడినా అభిమానుల అభిమానం గెలుచుకున్న మిస్టర్ కూల్..!
-
SEBI Loans: శుభవార్త చెప్పిన సెబీ.. షేర్లను తాకట్టు పెట్టి రుణాలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్..
-
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
-
Manchu Manoj : మైక్ వద్దు.. హెల్మెట్ పెట్టుకుని వెళ్లండి! మంచు ఫ్యామిలీ వివాదంపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!