Perni Nani: జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెడతారా?
- వైఎస్ జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు పెట్టారు..
- రాజమండ్రి పుష్కరల్లో తొక్కిసలాటపై చంద్రబాబుపై కేసు పెట్టాలి..
- కొల్లు రవీంద్ర చీమలకు, దోమలకు హాని చేయడు, మనుషులకే చేస్తాడు: పేర్నినాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani: కృష్ణజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. అనుమతి ఉన్న కారులో వెనక సీట్లో కూర్చుని ప్రయాణిస్తేనే కూడా కేసు పెడతారని ప్రశ్నించారు. మరి గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజమండ్రి పుష్కరాల్లో స్నానాలు చేస్తూ షూటింగ్ తీస్తున్న క్రమంలో 30 మంది భక్తులు చనిపోయారు.. చనిపోయిన భక్తుల బంధువులు కేసులు పెడితే రానున్న మా ప్రభుత్వంలో మీతో పాటు వెనక మీ కుటుంబ సభ్యులు, నీ కుమారుడు లోకేష్, సినిమా డైరెక్టర్ పై ఎందుకు కేసులు పెట్టకూడదని చంద్రబాబును పేర్నినాని ప్రశ్నించారు.
Read Also: Ghosts in Dreams: కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అది దేనికి సంకేతం..?
Also Read
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
- Kodali Nani: రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. ఆయన టీడీపీయే..!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
అలాగే, గుంటూరులో రూ 50 రూపాయల చీరలు లారీల్లో తీసుకొచ్చి చంద్రన్న కానుక పేరుతో మహిళలపై విసిరితే ఆ రద్దీలో చనిపోయిన వారి బంధువులు ఫిర్యాదు చేస్తే కేసులు ఎందుకు పెట్టకూడదని పేర్నినాని ప్రశ్నించారు. కందుకూరులో ఇరుకు సందులో నీవు మీటింగ్ పెట్టినప్పుడు మృతి చెందిన వారి బంధువులు కేసు ఎందుకు పెట్టకూడదు అన్నారు.. 2029లో వచ్చే తమ ప్రభుత్వంలో ప్రస్తుతం మీరు వ్యవహరిస్తున్న కక్షపూరిత కేసులకు ప్రతీకార చర్యలకు ధీటుగా సమాధానం చెప్తామని వెల్లడించారు. ఇక, కొల్లు రవీంద్ర ఉంటావా సొల్లు రవీంద్రగా అని కౌంటర్ ఇచ్చారు. ఇటీవల మచిలీపట్నం విచ్చేసిన మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్ర చీమకు కూడా హాని చేయడని పేర్కొన్నాడు.. ఇది నిజమే.. కొల్లు రవీంద్ర చీమకు, దోమకు కూడా హానిచేయడు.. కానీ, మనుషులను ఇబ్బందులకు గురి చేస్తాడని మాజీ మంత్రి పేర్నినాని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!