MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Yarlagadda Venkata Rao: కృష్ణా జిల్లాలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యవహారం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) భవనం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరుకాకపోవడం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు చిన్ని, బాలశౌరి తదితరులు పాల్గొన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ గైర్హాజరుకావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధి పనుల కాంట్రాక్టులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎయిర్పోర్టు పనులను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సన్నిహితంగా ఉన్నట్లు పేర్కొన్న కేఎంవీ (KMV) సంస్థకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఆ సంస్థ వంశీకి ఆర్థిక సహాయం చేసిందని కూడా విమర్శించారు. అంతేకాకుండా, మొత్తం పనుల్లో సుమారు 80 శాతం పనులకు రూ.300 కోట్లకు పైగా కేటాయిస్తే, కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్లు కేటాయించడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వం స్పష్టం చేయాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కూడా కోరారు.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
మరోవైపు, యార్లగడ్డ ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తనకు కేఎంవీ సంస్థతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఈ ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ కూడా రాసిన విషయం విదితమే.. వాస్తవాలు బయటకు రావాలని కోరుతూ యార్లగడ్డ చేసిన ఆరోపణలను ఖండించారు. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలోనే గన్నవరం ఎయిర్పోర్టులో జరిగిన ఏటీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి యార్లగడ్డ హాజరుకాకపోవడం మరింత చర్చకు దారితీసింది. ఆయన గైర్హాజరు వెనుక కాంట్రాక్టుల వివాదమే కారణమా? లేక ఇతర రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. అధికారికంగా యార్లగడ్డ గైర్హాజరుకు కారణాలు వెల్లడికాకపోయినా, ఇటీవల చేసిన ఆరోపణలతో ఈ ఘటనకు సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో గన్నవరం రాజకీయాల్లో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది..
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?