Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ స్పోర్ట్స్ 3 శాతం కోటాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు. అర్హతలు, సంబంధిత సర్టిఫికెట్లు లేకపోయినా, పరీక్ష రాయకపోయినా కొందరికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. లోకేష్ నాయకత్వంలో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని విమర్శించారు.
ఆటలు ఆడని వారికి కూడా స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు ఇచ్చారని, ఉద్యోగం వచ్చిన తర్వాత బీఈడీ పూర్తి చేసే అవకాశం కల్పించడం కూడా నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు కొడాలి నాని.. ఎమ్మెల్యేను ముందుగా నియమించి ఐదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించినట్లుగా ఈ డీఎస్సీ ప్రక్రియ సాగిందని ఎద్దేవా చేశారు. పంజాబ్లో టీచర్ పోస్టుల విక్రయాల కేసును ప్రస్తావిస్తూ, అక్కడ జరిగిన ఘటనల కంటే ఏపీలో మరింత పెద్ద స్థాయిలో అక్రమాలు జరిగాయని కొడాలి నాని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని ప్రకటించారు.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Kodali Nani: రావణ్ వ్యవహారంపై మళ్లీ స్పందించిన కొడాలి నాని.. ఘాటు వ్యాఖ్యలు..
అక్రమాలను ప్రశ్నిస్తే తమ పార్టీని, వైఎస్ జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని అన్నారు కొడాలి. బీహార్ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ, ప్రజల తీర్పు స్పష్టంగా కనిపిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించిన కొడాలి నాని.. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ జరిగిన ఉద్యమాలను తొలుత విమర్శించిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గిందని అన్నారు. రాష్ట్రంలోనూ అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!