Karumuri Nageswara Rao: చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి.. టీడీపీ మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు చెప్పే వ్యక్తి అని.. ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ ముసలి నక్క అని ధ్వజమెత్తిన ఆయన.. ఇటీవలే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఓ టిష్యూ పేపర్ లాంటిదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంతంగా ఏనాడు అధికారంలోకి రాలేదని అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అని ఆరోపించారు. అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వమే ముందుందని.. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు.
Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య
Also Read
- AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రాగులు, జొన్నలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి కారుమూరి వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్లో కూడా గోధుమ పిండి కొనుగోలు మొదలు పెట్టామన్నారు. గిరిజన ప్రాంతాల్లో మాత్రమే గత ప్రభుత్వం ఐదేళ్లలో రెడ్ కందిపప్పు (దాల్)కు రూ.487 కోట్లు ఖర్చు చేస్తే.. తమ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లకు 2 లక్షల 99 మెట్రిక్ టన్నులకు గాను ఒక వెయ్యి 73 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రబీ సీజన్లో రైతులకు 2763 కోట్లకు గాను 19.55 కోట్లు చెల్లించామన్నారు. ఇంకా చెల్లించాల్సింది రూ.800కొట్లేనని, అది కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. కేరళ రాష్ట్రం తమకు రైస్ కావాలని అడుగుతోందని, ఎంత రైస్ అయిన కొనడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తోందని చెప్పుకొచ్చారు.
Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
కాగా.. అంతకుముందు కూడా టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అలవికాని హామీలతో ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, టిష్యూ పేపర్ కన్నా హీనమైన ఆ మేనిఫెస్టోలోని హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాదంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మేనిఫెస్టో అమలుపై చర్చకు రావాలని, ఎవరెన్ని అమలు చేశారో చూద్దామని సవాల్ విసిరారు. బాబుకు పదవీ కాంక్ష, రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆలోచన వదలడం లేదని.. చంద్రబాబు ముఖంలో రాజకీయంగా ప్రేతకళ కనిపిస్తుందని ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
-
Bashar Al-Assad: సిరియా మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష..
-
Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
-
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..