Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newly Married Couple: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు. తెల్లారే సరికి పెళ్లింట్లో విషాదం నెలకొంది. శోభనం కోసం గదిలోకి వెళ్లిన కొత్త జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆనందోత్సవాలు జరుపుకుంటున్న ఇంటిలో ఒక్కసారిగా విషాదం నిండుకుంది. కొడుకు, కోడలు మృతదేహాలను చూసి ఇంట్లో కలకలం రేగింది. ఈ ఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన జంట మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది.
Read Also:Telangana: నిజామాబాద్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..
Also Read
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
వివరాల్లోకి వెళితే.. బహ్రైచ్లోని కైసర్గంజ్లోని గోధియా నంబర్ ఫోర్లో నివసిస్తున్న ప్రతాప్కు గోధియా.. నంబర్ టూలోని గుల్లన్పూర్వా గ్రామానికి చెందిన పుష్పయాదవ్తో మే 30, మంగళవారం వివాహం జరిగింది. కోలాహలంగా పెళ్లి ఊరేగింపుతో వధువు గుమ్మం వద్దకు చేరుకుంది. అన్ని లాంఛనాలతో వివాహ వేడుక పూర్తయింది. ఆ తర్వాత బుధవారం వరుడు వధువుతో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కొత్త కోడలుకు స్వాగతం పలికేందుకు పూర్తి సన్నాహాలు చేశారు. రాత్రి నవ దంపతులు నిద్రించడానికి తమ గదిలోకి వెళ్లారు. అయితే ఉదయం చాలా ఆలస్యమైనా ఇద్దరూ బయటకు రాలేదు.
Read Also:CM KCR TOUR: జూన్ 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన
మొదట్లో కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. వివాహ వేడుకలో అలసిపోవడంతో దంపతులు ఆలస్యంగా నిద్రపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే చాలా సేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వారి గది తలుపు తట్టారు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కిటికీలోంచి చూసే సరికి పుష్ప, ప్రతాప్ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు.కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ శవాలై కనిపించారు. అనంతరం పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. విచారణ, పోస్ట్మార్టం నివేదిక తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..