Newly Married Couple: శోభనానికి గదిలోకెళ్లారు.. తెల్లారేసరికి శవాలుగా తేలారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Newly Married Couple: ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు. తెల్లారే సరికి పెళ్లింట్లో విషాదం నెలకొంది. శోభనం కోసం గదిలోకి వెళ్లిన కొత్త జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆనందోత్సవాలు జరుపుకుంటున్న ఇంటిలో ఒక్కసారిగా విషాదం నిండుకుంది. కొడుకు, కోడలు మృతదేహాలను చూసి ఇంట్లో కలకలం రేగింది. ఈ ఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన జంట మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది.
Read Also:Telangana: నిజామాబాద్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..
Also Read
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- IND Vs IRE: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. తుది జట్టు ఇదే..
- Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
వివరాల్లోకి వెళితే.. బహ్రైచ్లోని కైసర్గంజ్లోని గోధియా నంబర్ ఫోర్లో నివసిస్తున్న ప్రతాప్కు గోధియా.. నంబర్ టూలోని గుల్లన్పూర్వా గ్రామానికి చెందిన పుష్పయాదవ్తో మే 30, మంగళవారం వివాహం జరిగింది. కోలాహలంగా పెళ్లి ఊరేగింపుతో వధువు గుమ్మం వద్దకు చేరుకుంది. అన్ని లాంఛనాలతో వివాహ వేడుక పూర్తయింది. ఆ తర్వాత బుధవారం వరుడు వధువుతో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కొత్త కోడలుకు స్వాగతం పలికేందుకు పూర్తి సన్నాహాలు చేశారు. రాత్రి నవ దంపతులు నిద్రించడానికి తమ గదిలోకి వెళ్లారు. అయితే ఉదయం చాలా ఆలస్యమైనా ఇద్దరూ బయటకు రాలేదు.
Read Also:CM KCR TOUR: జూన్ 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన
మొదట్లో కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. వివాహ వేడుకలో అలసిపోవడంతో దంపతులు ఆలస్యంగా నిద్రపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే చాలా సేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వారి గది తలుపు తట్టారు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కిటికీలోంచి చూసే సరికి పుష్ప, ప్రతాప్ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు.కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ శవాలై కనిపించారు. అనంతరం పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. విచారణ, పోస్ట్మార్టం నివేదిక తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
తాజావార్తలు
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
-
Stock market: 4 రోజులు.. రూ.88,000 కోట్ల ప్రాఫిట్! స్టాక్ మార్కెట్ను షేక్ చేసిన ఆరు టాప్ కంపెనీలు ఇవే..
-
Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే ‘కమలం’ వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
-
Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!