Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. నలుగురు మృతి
Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.. పరవాడ ఫార్మాసిటీలోని లారస్ యూనిట్ -3లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. లారస్ ఫార్మా లో జరిగిన ప్రమాదంలో ఐదు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పి.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.. కిమ్స్ ఐకాన్ లో సతీష్ అనే కార్మికుడికి చికిత్స పొందుతుండగా.. మిగతా నలుగురిని కేజీహెచ్కు తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్ బాబు, కే.కోటపాడుకు చెందిన ఆర్. రామకృష్ణ, చోడవరానికి చెందిన మజ్జి వెంకటరావు మృతిచెందారు.. ఇక, మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాకు ప్లాష్ ఫైర్ డ్రయర్ రూంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. రియాక్టర్ కింద నుంచి ఫైర్ అవ్వడంతో ప్రమాదం సంభవించింది..
Read Also: Tiger Attack: అసోంలో జనాలపై విరుచుకుపడ్డ చిరుత.. దాడిలో 13మందికి గాయాలు
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో నీ లారస్ ల్యాబ్ లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించిన దశలో ఐదుగురు కార్మికులు ఒకే చాంబర్లో ఉండడంతో ఒక్కసారిగా మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే షీలా నగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజేష్.. రాంబాబు.. రామకృష్ణ వెంకట్రావు చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. మరో కార్మికుడు సతీష్ అత్యవసర వైద్యం పొందుతున్నట్టు తెలుస్తుంది. కంపెనీలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు కొందరు చెబుతుంటే మరికొందరు రసాయనాలు లీకు కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో