Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం సంభవించింది.. ఈ ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెబుతున్నారు.. పరవాడ ఫార్మాసిటీలోని లారస్ యూనిట్ -3లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. లారస్ ఫార్మా లో జరిగిన ప్రమాదంలో ఐదు కార్మికులకు తీవ్రంగా గాయపడ్డారు.. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఆర్పి.. బాధితులను ఆస్పత్రికి తరలించారు.. కిమ్స్ ఐకాన్ లో సతీష్ అనే కార్మికుడికి చికిత్స పొందుతుండగా.. మిగతా నలుగురిని కేజీహెచ్కు తరలించారు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్ బాబు, కే.కోటపాడుకు చెందిన ఆర్. రామకృష్ణ, చోడవరానికి చెందిన మజ్జి వెంకటరావు మృతిచెందారు.. ఇక, మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాకు ప్లాష్ ఫైర్ డ్రయర్ రూంలో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు.. రియాక్టర్ కింద నుంచి ఫైర్ అవ్వడంతో ప్రమాదం సంభవించింది..
Read Also: Tiger Attack: అసోంలో జనాలపై విరుచుకుపడ్డ చిరుత.. దాడిలో 13మందికి గాయాలు
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటిలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు మరొకరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు చెబుతున్నాయి. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో నీ లారస్ ల్యాబ్ లో మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించిన దశలో ఐదుగురు కార్మికులు ఒకే చాంబర్లో ఉండడంతో ఒక్కసారిగా మంటలకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే షీలా నగర్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రాజేష్.. రాంబాబు.. రామకృష్ణ వెంకట్రావు చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందారు. మరో కార్మికుడు సతీష్ అత్యవసర వైద్యం పొందుతున్నట్టు తెలుస్తుంది. కంపెనీలోని షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు కొందరు చెబుతుంటే మరికొందరు రసాయనాలు లీకు కారణంగా ప్రమాదం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి ఆర్డీవో చిన్నికృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!