ED Raids: అర్థరాత్రి వరకు జేసీ ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లాలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టించాయి.. మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సోదాలు నిర్వహించారు. తాడిపత్రితో పాటు హైదరాబాద్లోని జేసీ సోదరుల నివాసాల్లో ఏకకాలం దాడుల నిర్వహించారు ఈడీ అధికారులు.. ఇదే సమయంలో జేసీ సోదరుల ముఖ్య అనుచరుడిగా ఉన్న కాంట్రాక్టర్ గోపాల్రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి.. ఈ సోదాల నేపథ్యంలో వారి నివాసాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- Kesineni Nani vs Kesineni Chinni: కేశినేని బ్రదర్స్ మధ్య మళ్లీ ముదిరిన వార్.. ఎంపీ చిన్నిపై ఈడీకి నాని ఫిర్యాదు
అయితే, ఈడీ అధికారులు ఎందుకు జేసీ సోదరులను టార్గెట్ చేశారు అనే విషయంలో క్లారిటీ రాలేదు.. దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి.. మైనింగ్, ట్రాన్స్పోర్టుతో పాటు అనేక రకాల వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత వారిని వరుసగా కొన్ని కేసులు వెంటాడాయి.. ఇప్పుడు ఈడీ రంగంలోకి వచ్చింది. ఇక, ఈ వ్యవహారంపై స్పందించిన జేసీ ప్రభాకర్రెడ్డి.. ఈడీ అధికారులు ఎందుకు వచ్చారన్నదానిపై రెండు, మూడు రోజుల్లో తెలుస్తుందన్నారు.. ఈడీ సోదాల వెనుక రాజకీయ కారణాలు ఉంటాయని అనుకోవడం లేదన్న ఆయన.. ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకున్నది లేదు, దొరికింది లేదన్నారు.. అధికారులకు కావాల్సిన సమాధానం తీసుకున్నారు.. రెండు, మూడు రోజుల్లో దానిపై క్లారిటీ వస్తుందన్నారు. అందరి సెల్ఫోన్లు ఇచ్చారు.. నా సెల్ ఫోన్ మాత్రం ఇవ్వలేదని తెలిపారు. కాగా, నిన్న ఉదయం ఈడీ సోదాలు ప్రారంభమైన వెంటనే జేసీ కుటుంబ సభ్యుల సెల్ఫోన్లు మొత్తం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తంగా జేసీ ఇంట్లో ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సాగిన ఈడీ సోదాలు చర్చగా మారాయి.
తాజావార్తలు
-
Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
-
Social Media: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
-
Rao Bahadur Teaser: లాస్ట్లో ఆ డైలాగ్ నెక్స్ట్ లెవెల్.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ టీజర్ చూశారా!
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!