Home
Enforcement Directorate
Enforcement Directorate News
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్లోని అన్ని పదవులకు రాజీనామా
Harish Rawat: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన మాజీ సహాయకుడు, ప్రస్తుతం PAగా పనిచేస్తున్న చందన్ సింగ్ జీనా నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహించిన మరుసటి రోజే హరీశ్ రావత్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తన వల్ల కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంపై ఎలాంటి ప్రశ్నలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే… -
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ACB) దర్యాప్తు సందర్భంగా గుర్తించిన భారీ ఆస్తులపై ఇప్పుడు ఈడీ దృష్టి సారించింది. భీమ్రెడ్డికి చెందిన రూ.150 కోట్లకు పైగా విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) పరిధిలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భీమ్రెడ్డిని ఏసీబీ జూలై 6న అరెస్ట్ చేసింది. ఏసీబీ… -
YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
YS Viveka M*urder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన జారీ చేసింది. హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. సోదాల్లో నేరానికి సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. CBI నమోదు చేసిన FIR, దాఖలు చేసిన చార్జ్షీట్ల ఆధారంగా ఈ కేసులో ECIR నమోదు చేసినట్లు ED తెలిపింది. IPCలోని సంబంధిత… -
Nidhhi Agerwal: బెట్టింగ్ యాప్స్ కేసులో నిధి అగర్వాల్కు ఈడీ షాక్: 4 గంటల పాటు ప్రశ్నల వర్షం!
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో ఆమె విచారణ ముగిసింది. అక్రమ ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫామ్ల ప్రమోషన్ల వ్యవహారంలో అధికారులు ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రముఖ బెట్టింగ్ యాప్ ‘జీత్ విన్’ (JeetWin) సహా పలు వివాదాస్పద ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం, ప్రమోషనల్ యాడ్స్లో నటించడంపై ఈడీ అధికారులు ప్రధానంగా… -
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
Vijay Mallya: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా, భారత బ్యాంకుల మధ్య దాదాపు దశాబ్దంగా కొనసాగుతున్న న్యాయపోరాటం మరోసారి తెరపైకి వచ్చింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల వ్యవహారంలో మాల్యా ఆస్తుల జప్తు, వేలం ద్వారా ఇప్పటివరకు రూ.14,131.60 కోట్ల విలువైన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు తిరిగి ఇచ్చినట్లు మాల్యా తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టుకు తెలిపారు. ముంబై, బెంగళూరు, గోవా సహా పలు ప్రాంతాల్లో ఉన్న మాల్యాకు చెందిన చర, స్థిరాస్తులను విక్రయించడం… -
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) 14వ ప్రిలిమినరీ పరీక్షలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు ప్రారంభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర CID నమోదు చేసిన FIR ఆధారంగా గత వారం ED ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) నమోదు చేసింది. JPSC-JSSC పరీక్షలకు హాజరైన అభ్యర్థులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని… -
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
AP Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కు నాంపల్లి కోర్టు మూడు రోజుల ఈడీ కస్టడీని మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి ఈ ముగ్గురిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. కోర్టు అనుమతి తర్వాత చర్లపల్లి జైలులో… -
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
Bank Fraud: బ్యాంకు మోసం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరో కీలక చర్య చేపట్టింది. భోపాల్ జోనల్ కార్యాలయం అధికారులు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA), 2002 కింద సుమారు రూ.3.66 కోట్ల విలువైన రెండు ఇన్వెస్ట్మెంట్ లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను తాత్కాలికంగా అటాచ్ చేశారు. ఈ కేసు M/S అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ (AOPL), దాని ప్రమోటర్ శ్రీకాంత్ భాసికి సంబంధించినది. స్టేట్ బ్యాంక్ ఆఫ్… -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడి అరెస్ట్..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కారుమూరి సునీల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిలను అరెస్ట్ చేసిన ఈడీ, తాజాగా సునీల్ను అదుపులోకి తీసుకుంది. ఇక, అరెస్ట్ అనంతరం కారుమూరి సునీల్కు హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో వైద్య… -
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 11, 2026న పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద హైదరాబాద్లోని ఐదు ప్రాంతాల్లో…
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!