Minister Nadendla Manohar: ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు.. వైద్య సిబ్బంది ఆగ్రహం..
- ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు..
- వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాదెండ్ల మనోహర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై మండిపడ్డారు.. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై విరుచుకుపడ్డారు.. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు మంత్రి.. ఇక, మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు అందేలా చూడాలని సూచించారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.. తన ఆకస్మిక పర్యటనలో.. ఆసుపత్రిలో వివిధ విభాగాలని పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్.. అధికారులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మార్పులకు కీలక సూచనలు చేశారు.
Read Also: ISRO: కొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో.. డాకింగ్ ప్రక్రియ విజయవంతం
Also Read
- Lemon Prices: అమాంతం పెరిగిన నిమ్మకాయల ధరలు.. రూ.30 నుంచి రూ.130కి..!
- Home Minister Anitha: 'మావిగన్' పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
- Nimmala Ramanaidu: కేంద్ర జలశక్తి కార్యదర్శికి మంత్రి నిమ్మల కీలక సూచనలు..
- CM Chandrababu: నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలం పోలవరం ప్రాజెక్టు.. మీరు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు..
ఇక, ఏలూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోగులకు సౌకర్యాలు పెంచడంపైన ఎక్కువ దృష్టి పెట్టాం అన్నారు.. నర్సులు, డాక్టర్లు, సిబ్బంది కొరత ఉన్నట్టుగా గుర్తించాం.. వీల్ చైర్స్ సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి ఎక్కడా లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సతో పాటు, స్పెషాలిటీ సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!