Kottu Satyanarayana: వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్.. పవన్ ప్రసంగాలు ఉన్మాదికి ఎక్కువ, పిచ్చికి తక్కువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Kottu Satyanarayana Fires On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ తాజాగా జనసేనాధినేత పవన్ కళ్యాణ్పై ధ్వజమెత్తారు. పవన్ వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని.. ఆయన ప్రసంగాలు ఉన్మాదానికి ఎక్కువ, పిచ్చికి తక్కువ అని దుయ్యబట్టారు. అసలు తానేం మాట్లాడుతున్నాడో, అతనికే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ మాటలు చూస్తుంటే.. అతని మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా బాధ్యత తీసుకుంటానని ఓసారి.. సీఎం అయ్యే బలం లేదని, పొత్తులుంటాయని మరో దగ్గర పవన్ చెప్తాడని అన్నారు. కత్తిపూడి సభలో సీఎం అయ్యేందుకు సంసిద్ధంగా ఉన్నానని పవన్ చెప్తాడని, అసలు పవన్ ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థం అవుతోందా? అని నిలదీశారు. ద్వారంపూడి విసిరిన సవాల్కి పవన్ తోక ముడిచాడంటూ కౌంటరిచ్చారు.
Alla Nani: పవన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.. మాజీ మంత్రి ధ్వజం
Also Read
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- AP Govt: రైతులకు, భూ యజమానులకు బిగ్ రిలీఫ్.. మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం..
కాపుల మనోభావాలు దెబ్బతీసేలా ముద్రగడపై పవన్ అవాకులు చవాకులు పేలాడని కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. నరసాపురంలో మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టాడని పేర్కొన్నారు. గోదావరి జిల్లాల టూర్ తర్వాత పవన్ మానసిక స్ధితిని అనుమానించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోందని సందేహం వ్యక్తం చేశారు. వారాహి యాత్రతో పవన్ గ్రాఫ్ పదింతలు తగ్గిపోయిందని అన్నారు. పవన్ సభలకి వచ్చే జనాలు వేల సంఖ్యల నుంచి వందల సంఖ్యకి పడిపోయిందన్నారు. పవన్ ద్వారా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు చీల్చాలని చంద్రబాబు వేసిన పాచిక పారలేదని తేల్చి చెప్పారు. అసలు కాపు ద్రోహి అయిన చంద్రబాబు పంచెన పవన్ ఎందుకు చేరాడో ప్రజలకి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గొడవలోనూ జనసేన కార్యకర్తలే ఉంటారని, తమ కార్యకర్తల్ని గూండాలుగా, రౌడీలుగా తయారు చేసేలా పవన్ రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు.
Titan tragedy: టైటాన్కి “టైటానిక్ శాపం” తగిలిందా..? పలు సంఘటనల ఆధారంగా రూమర్స్..
రాష్ట్రం అగ్నిగుండంగా మారిందంటూ.. చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసి కుట్ర పన్నుతున్నారని కొట్టు సత్యనారాయణ ఆరోపణలు చేశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో పవన్ కళ్యాణ్ ఏ రోజూ ప్రశ్నించలేదన్నారు. మా పాలన చూసి ఓటు వేయమని ప్రజల్ని అడుగుతున్నామని.. మరి 2014-19 పాలన చూసి ఓటు వేయమని మీరు అడగలరా? అని చంద్రబాబుకు సవాల్ విసిరారు. 219 దేవాలయాల్ని కూల్చేశామని పవన్ చెప్తున్నాడని.. మరి చంద్రబాబు హయాంలో గుళ్లు కూల్చేయలేదా? అని అడిగారు. సీఎం జగన్ కూల్చేసిన గుళ్లను తిరిగి నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!