Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Partition 1947: చాలా ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, ప్రీతి జింటా కలిసి వెండితెరపై కనిపించబోతుండటంతో ‘పార్టిషన్ 1947’ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కూడా ఈ ఇద్దరూ దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానుల భారీ రద్దీ మధ్య ఒక యువకుడికి గాయాలు కావడంతో కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
సన్నీ డియోల్, ప్రీతి జింటా సినిమా ప్రమోషన్ కోసం లక్నోలోని కృష్ణ నగర్ ప్రాంతంలోని ఫీనిక్స్ మాల్కు శుక్రవారం వెళ్లారు. తమ అభిమాన నటీనటులను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఫొటోలు తీసుకుంటుండగా ఒక వ్యక్తి కాలికి గాయం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. తొలుత సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రమాద తీవ్రతపై రకరకాల ప్రచారం జరిగింది.
Also Read
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
అయితే లక్నో పోలీసులు దీనిపై వెంటనే స్పష్టత ఇచ్చారు. ఫీనిక్స్ మాల్లో ఫొటోలు తీసుకుంటున్న సమయంలో వ్యక్తి కాలికి స్వల్ప గాయం మాత్రమే అయిందని పోలీసులు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. గాయపడిన వ్యక్తికి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారని, ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా సాధారణంగా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే లక్నో పర్యటన సందర్భంగా సన్నీ డియోల్, ప్రీతి జింటా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కూడా కలిశారు. నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో ఇద్దరు నటులతో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. అనంతరం వారికి దేవుళ్లు, దేవతల విగ్రహాలను బహూకరించి ఫొటోలకు పోజులిచ్చారు.
సన్నీ డియోల్, ప్రీతి జింటా కాంబినేషన్కు కూడా ‘పార్టిషన్ 1947’ ప్రత్యేకమైనదే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఇద్దరు నటులు మరోసారి కలిసి తెరపై కనిపించనున్నారు. గతంలో 2018లో విడుదలైన ‘భయ్యాజీ సూపర్హిట్’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, సన్నీ, ప్రీతి కెమిస్ట్రీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు ‘పార్టిషన్ 1947’తో ఈ హిట్ జంట మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హిస్టారికల్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే బజ్ పెరిగింది. ఆగస్టు 14న ‘పార్టిషన్ 1947’ థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్ సమయంలో చోటుచేసుకున్న ఘటనపై పోలీసులు స్పష్టత ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత సన్నీ, ప్రీతి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మూవీని చూసేందుకు ప్రజలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
- Tags
- cinema
- Partition 1947
తాజావార్తలు
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
-
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
-
Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!