Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ap Speaker Tammineni Sitaram Comments About Supreme Court Verdict

Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?

Published Date :November 29, 2022 , 11:15 am
By Ramesh Nalam
Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థలకు దేనికదే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారని తమ్మినేని అన్నారు. రాజ్యాంగంలో లక్మణరేఖలు ఉన్నాయని.. వాటిని లైన్ క్రాస్ చేయటానికి వీలులేదని స్పష్టం చేశారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకోవాలని సూచించారు.

Read Also: Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?

Also Read

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
  • CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
  • Off The Record : వైసీపీకి డోర్స్ క్లోజ్.. పవనే నా బాస్! రూమర్లకు చెక్ పెట్టిన బాలినేని
  • Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
Add as a preferred
source on google

తామే గొప్ప అనుకుంటే ప్రజలలో పలుచన అవుతామని తమ్మినేని సీతారాం అన్నారు. గోలక్‌నాథ్ కేస్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసుల్లో చారిత్రాత్మక తీర్పులు వచ్చిన సంగతి మరిచిపోరాదన్నారు. మూడు రాజధానుల కేసు సందర్భంగా హైకోర్టు ఓవర్ ల్యాప్ అయ్యిందన్నారు. న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం శాసన వ్యవస్థకు ఉందని తెలిపారు. ప్రభుత్వ విధులు హైకోర్టు చేస్తుంది కాబట్టే తాము సుప్రీంకోర్టుకు వెళ్లా్ల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి కట్టుబడి పాలన‌ సాగిస్తున్నారని తెలిపారు. ఆరుమాసాలలో ఒక ఇల్లు కూడా కట్టలేమని.. అలాంటిది రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. ఈ తీర్పును చూసి ప్రజలు నవ్విపోయారన్నారు. శాసనసభ చట్టం చేయకూడదంటే ఎలా అని నిలదీశారు. శాసనసభలో కూడా తమ హక్కుల గురించే మాట్లాడామని.. ఇక్కడి న్యాయవ్యవస్థ మాటలకు బాధపడ్డామన్నారు. వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న జనసేన, టీడీపీ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై క్లారిటీ ‌ఇవ్వాలన్నారు.

Read Also: Muslim weddings: వివాహాల్లో డ్యాన్సులు, మ్యూజిక్‌ను నిషేధించిన ముస్లిం మతపెద్దలు.. ఎక్కడంటే?

రైతుల పేరుతో బినామీ యాత్రలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిధంగా చేస్తున్నారని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామన్న చంద్రబాబుది పొలిటికల్ డ్రమిటిక్ షో అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది మూడు ప్రాంతాల మనోభావాలకు సంబంధించిందని పేర్కొన్నారు. తన‌ బినామీలతో భూములు కొనిపించి రేట్లు పెంచుకునే ప్రక్రియ చేపట్టారని.. హైకోర్టు తన పరిధి దాటిందని తాము ఆరోజే చెప్పామన్నారు. మనమంతా సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి ఉండాలన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిదని.. లేకపోతే వ్యవస్థలో అరాచకం వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత గురించి తాము ప్రశ్నించడం లేదని.. తమకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అమరావతి ఓ భ్రమరావతి అని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap politics
  • Supreme Court
  • tammineni sitaram
  • three capitals

తాజావార్తలు

  • PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్‌పై ఉత్కంఠభరిత గెలుపు.!

  • Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ

  • Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్‌ తీరును ఎండగట్టిన ట్రంప్

  • Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్‌లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!

  • PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions