Tammineni Sitaram: సుప్రీం తీర్పు భేష్.. ఆరునెలల్లో ఇల్లే కట్టలేం.. రాజధాని ఎలా కడతాం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక సంస్థలకు దేనికదే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారని తమ్మినేని అన్నారు. రాజ్యాంగంలో లక్మణరేఖలు ఉన్నాయని.. వాటిని లైన్ క్రాస్ చేయటానికి వీలులేదని స్పష్టం చేశారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ గౌరవించుకోవాలని సూచించారు.
Read Also: Monkeypox: మంకీపాక్స్కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
తామే గొప్ప అనుకుంటే ప్రజలలో పలుచన అవుతామని తమ్మినేని సీతారాం అన్నారు. గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి, మినర్వా మిల్స్ కేసుల్లో చారిత్రాత్మక తీర్పులు వచ్చిన సంగతి మరిచిపోరాదన్నారు. మూడు రాజధానుల కేసు సందర్భంగా హైకోర్టు ఓవర్ ల్యాప్ అయ్యిందన్నారు. న్యాయవ్యవస్థపై సంపూర్ణ గౌరవం శాసన వ్యవస్థకు ఉందని తెలిపారు. ప్రభుత్వ విధులు హైకోర్టు చేస్తుంది కాబట్టే తాము సుప్రీంకోర్టుకు వెళ్లా్ల్సి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగానికి కట్టుబడి పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఆరుమాసాలలో ఒక ఇల్లు కూడా కట్టలేమని.. అలాంటిది రాజధాని ఎలా కడతారని ప్రశ్నించారు. ఈ తీర్పును చూసి ప్రజలు నవ్విపోయారన్నారు. శాసనసభ చట్టం చేయకూడదంటే ఎలా అని నిలదీశారు. శాసనసభలో కూడా తమ హక్కుల గురించే మాట్లాడామని.. ఇక్కడి న్యాయవ్యవస్థ మాటలకు బాధపడ్డామన్నారు. వికేంద్రీకరణపై యాగీ చేస్తున్న జనసేన, టీడీపీ కూడా సుప్రీంకోర్టు తీర్పుపై క్లారిటీ ఇవ్వాలన్నారు.
Read Also: Muslim weddings: వివాహాల్లో డ్యాన్సులు, మ్యూజిక్ను నిషేధించిన ముస్లిం మతపెద్దలు.. ఎక్కడంటే?
రైతుల పేరుతో బినామీ యాత్రలు చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టేవిధంగా చేస్తున్నారని తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామన్న చంద్రబాబుది పొలిటికల్ డ్రమిటిక్ షో అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది మూడు ప్రాంతాల మనోభావాలకు సంబంధించిందని పేర్కొన్నారు. తన బినామీలతో భూములు కొనిపించి రేట్లు పెంచుకునే ప్రక్రియ చేపట్టారని.. హైకోర్టు తన పరిధి దాటిందని తాము ఆరోజే చెప్పామన్నారు. మనమంతా సర్వోన్నత న్యాయస్థానానికి లోబడి ఉండాలన్నారు. ఎవరి పని వారు చేస్తే మంచిదని.. లేకపోతే వ్యవస్థలో అరాచకం వస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ విశ్వసనీయత గురించి తాము ప్రశ్నించడం లేదని.. తమకు న్యాయ వ్యవస్థపై గౌరవం ఉందన్నారు. అమరావతి ఓ భ్రమరావతి అని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు.
తాజావార్తలు
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!