Amarnath: అమర్నాథ్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. చర్యలకు సీఎం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమర్నాథ్ ఒక్కసారిగా వదరలు విరుచుకుపడ్డాయి.. దీంతో 15 మందికి పైగా భక్తులు మృతిచెందగా.. మరో 40 మందికి పైగా భక్తులు గల్లంతైనట్టు తెలుస్తోంది.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.. ఇక, ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అమర్నాథ్లో వరదలో బీభత్సం సృష్టించిన సమయంలో 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు చెబుతున్నారు.. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.
Read Also: Nupur Sharma controversy: నుపుర్ శర్మ ఎఫెక్ట్.. భారత్పై సైబర్ వార్.. 2 వేల సైట్లు హ్యాక్..!
Also Read
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- Road Accident: గుంటూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా ఐపీఎస్ కుమార్తె మృతి..
- Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్గా నిర్ధారించిన వైద్యులు..
- VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
ఏపీలోని పలు జిల్లాల నుంచి అమర్నాథ్ యాత్రకు భక్తులు వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అమర్నాథ్ యాత్రలో విశాఖ వాసులు చిక్కుకున్నారని సమాచారం.. విశాఖ నుంచి సుమారు 90 మంది వెళ్లినట్టు తెలుస్తోంది.. ఈనెల 1న విశాఖ నుంచి బయల్దేరి వెళ్లారట కొంతమంది యాత్రికులు.. దీంతో, అధికారులను అప్రమత్తం చేశారు సీఎం వైఎస్ జగన్.. అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. అమర్నాథ్ యాత్రలో కుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చేసుకోవాలని సూచించారు. ఇక, సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్తో మాట్లాడారు. అడిషనల్ రెసిడెంట్ కమిషనర్గా ఉన్న హిమాంశు కౌసిక్ను వెంటనే శ్రీనగర్కు పంపిస్తున్నారు. యాత్రికుల భద్రత, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఆయన సమన్వయం చేస్తూ.. అవసరమైన చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అమర్నాథ్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!