Ban on Plastic Flexis: ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లపై నిషేధం.. నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్లాస్టిక్ వస్తువులతో ఉత్పన్నమయ్యే కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఇకపై ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తున్నట్టు ఈ మధ్యే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… ఇకపై క్లాత్తో తయారు చేసిన ఫ్లెక్సీలను మాత్రమే వినియోగించాలని సూచించారు. విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. అయితే, ఇవాళ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం… పర్యావరణ పరిరక్షణ చట్టం కింద 2022 నవంబరు 1 తేదీ నుంచి నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తికి, దిగుమతికి ఎవరికీ అనుమతి లేదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
Read Also: Hyderabad Metro Rail: మెట్రో రైల్ పిల్లర్పై పోస్టర్ వేస్తే రంగు పడుద్ది.. ఫైను, జైలు..!
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- OTR: సొంత జిల్లాలో రామ్మోహన్కు అసంతృప్తి సెగ?
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనకు కూడా నిషేధం వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. నగర, పట్టణ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ ఇనస్పెక్టర్లు బాధ్యత వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వినియోగించకుండా జిల్లా కలెక్టర్లు, జెడ్పీసీఈవోలు, పంచాయితీ అధికారులు, గ్రామ సచివాలయాలు బాధ్యత వహించాల్సిందిగా సూచనలు జారీ చేసింది.. నిషేధం ఉత్తర్వులు అమలు తర్వాత ప్రతీ ఫ్లెక్సీకి రూ. 100 మేర జరిమానా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై పర్యావరణ పరిరక్షణ చట్టం కింద శిక్ష తప్పదని హెచ్చరించింది.. ఫ్లెక్సీల నిషేధిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ అమలు పర్యవేక్షణను రెవెన్యూ, పోలీసు, రవాణా, జీఎస్టీ తదితర అధికారులు చేపట్టాలని ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్లకు బదులుగా కాటన్, నేత వస్త్రాలను వినియోగించుకోవచ్చని సూచనలు ఇస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!