బుసలు కొడుతోన్న కోవిడ్.. ఏపీలో భారీగా పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ మహమ్మారి బుసలు కొడుతోంది.. వరుసగా భారీ స్థాయిలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.. ముఖ్యంగా సంక్రాంతి పండుగ తర్వాత క్రమంగా కోవిడ్ మీటర్ పైకే కదులుతోంది.. ఓవైపు టెస్ట్ల సంఖ్య తగ్గినా.. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కలకలం రేపుతోంది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 44,516 శాంపిల్స్ పరీక్షించగా 13,212 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఐదుగురు కోవిడ్ బాధితులు మరణించారు. విశాఖలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. ఇదే సమయంలో ఒకేరోజు 2,942 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 64,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇప్పటి వరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 3,20,56,618కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసులు 21,53,268కి, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 20,74,600కి, మొత్తం మరణాల సంఖ్య 14,532కి పెరిగాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా విశాఖలో 2,244 కేసులు నమోదు కాగా చిత్తూరు జిల్లాలో 1,585, అనంతపురం 1,235, శ్రీకాకుళం 1.230, గుంటూరు 1,054, నెల్లూరులో 1,051 కేసులు నమోదు అయ్యాయి.
Also Read
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!