Gorantla Madhav: చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..! ఎస్పీకి టీడీపీ, జనసేన ఫిర్యాదు
- చిక్కుల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..
- మాజీ ఎంపీపై ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన..
- అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు..
- మాధవ్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. రాష్ట్రంలో అలజడలు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు..
Read Also: Earthquake: చెన్నైలో భూకంపం.. భయంతో జనాలు పరుగులు
Also Read
- Thopudurthi Prakash Reddy: సోదరుడి అరెస్ట్పై తోపుదుర్తి ఫైర్.. మా అన్న అరెస్ట్ అక్రమం
- Thopudurthi Rajasekhar Reddy Arrest: మహేశ్వర్ రెడ్డి మృతి కేసులో కీలక మలుపు.. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరెస్ట్..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
కాగా, తాజాగా పోలీసులు నోటీసులు ఇవ్వడంపై గురువారం రోజు స్పందించిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని పెట్టిన కేసు ఇది.. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతా.. మాట్లాడే హక్కును, భావ ప్రకటన స్వేఛ్చాను ఈ ప్రభుత్వం హరిస్తోంది.. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే.. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, చంద్రబాబు, పవన్ కల్యాణ్.. మీరు చేస్తున్నవి గుర్తు పెట్టుకోండి.. మార్చి 5వ తేదీన నా లీగల్ అడ్వయిజరీతో కలిసి పీఎస్ కి వెళ్లి విచారణకు సహకరిస్తా.. మార్చి 5న నాకు ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే విచారణకు హాజరవుతాను అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!