Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cpm Leaders Meet Jal Shakti Minister C R Patil On The Polavaram Displaced People Issues

Polavaram: పోలవరం ప్రాజెక్టుతో లక్షా 6 వేల కుటుంబాలకు ఇబ్బందులు..

Published Date :September 15, 2025 , 6:00 pm
By Sudhakar Ravula
  • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో సీపీఎం నేతల బృందం భేటీ..
  • పోలవరం నిర్వాసితుల సమస్యలపై విజ్ఞప్తి.. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్షా 6 వేల కుటుంబాలకు ఇబ్బందులు..
Polavaram: పోలవరం ప్రాజెక్టుతో లక్షా 6 వేల కుటుంబాలకు ఇబ్బందులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Polavaram: పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ను కలిసింది సీపీఎం ప్రతినిధి బృందం.. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ ను కలిసిన వారిలో సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పోలవరం నిర్వాసితులు ఉన్నారు.. ఈ సందర్భంగా ఎంపీ జాన్ బ్రిటాస్.. మాట్లాడుతూ. 8 మండలాల్లో 392 గ్రామాల్లో లక్ష ఆరు వేల కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని కేంద్రమంత్రికి తెలిపామన్నారు.. పోలవరం ప్రాజెక్టు కోసం పరిహారం పునరావాసం కింద 33 వేల కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు 5200 కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.. మెజారిటీ నిధులు నిర్వాసితులకు ఇల్లు కట్టిన కాంట్రాక్టర్లకు వెళ్లాయని.. ఇప్పటి వరకు 12,658 కుటుంబాలకు మాత్రమే పునరావాసం పరిహారం అందాయని.. ఇల్లు పొందినవారి నివాసాలు కూడా లీకేజీ గురవుతున్నాయని మంత్రికి తెలిపారు..

Read Also: Telangana Colleges Strike : కాలేజీల బెదిరింపులు, చర్యలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

పోలవరం ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరాలకు 20 లక్షల రూపాయలు, పునరావాసం కోసం పది లక్షల రూపాయలు ఇవ్వాలని విజ్ఞాపన పత్రం అందజేశారు సీపీఎం ప్రతినిధులు.. పునరావాస కాలనీలు 75 ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 20 వరకు పూర్తయ్యాయని త్వరగా మిగిలిన కుటుంబాలకు పరిహారం.. పనరావాసం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.. అయితే, పోలవరం భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి త్వరలో కేంద్ర బృందాన్ని పంపిస్తామని సీపీఎం నేతలకు హామీ ఇచ్చారు కేంద్రమంత్రి సి.ఆర్ పాటిల్.. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవడం లేదు.. పోలవరం నిర్వాసితుల సమస్య తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వామీదే అని మంత్రికి తెలిపారు సీపీఎం నేతలు..

Read Also: CM Siddaramaiah: హిందూ మతంలో సమానత్వం ఉంటే.. మతం ఎందుకు మారుతున్నారు?

ఇక, ఢిల్లీలో మూడు రోజులపాటు సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహించబోతున్నాం.. దేశంలోని తాజా రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాలపై చర్చ జరుగుతుందన్నారు వి. శ్రీనివాసరావు.. భారత్ పై అమెరికా ట్రంప్ టారిఫ్ నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది.. బీహార్ ఎన్నికలు , ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించాం.. ట్రంప్ టారిఫ్ ల టెర్రరిజం ఇది.. దీనిపై మోడీ ప్రభుత్వం దోబూచులాడుతుంది .. తెర వెనుక అన్ని కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం నిర్వహిస్తుంది.. పత్తిపై ఎలాంటి పన్ను లేకుండా కేంద్ర ప్రభుత్వం దిగుమతులు చేసుకునేందుకు అంగీకరించింది అని విమర్శించారు.. రాబోయే నెల రోజుల్లో దేశవ్యాప్తంగా క్యాంపెనింగ్ నిర్వహించాలని నిర్ణయించాం.. ఏపీలో పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకిస్తున్నాం.. కేరళలో ప్రభుత్వ ఆధ్యంలో విద్య ప్రజా ఆరోగ్య నడుస్తుంది. అమలాపురం మెడికల్ కాలేజ్ ఇప్పటికే సగం పూర్తయింది..కంపెనీవారు పనిచేయకుండా వెళ్లిపోయారు.. పాడేరు లో 100 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.. ట్రైబల్ యూనివర్సిటీకి సైతం క్యాంపస్ లేదు .. వైద్యం, విద్య ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి.. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు వి.శ్రీనివాసరావు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CPM
  • Jal Shakti Minister C.R. Patil
  • polavaram
  • Polavaram Displaced people

తాజావార్తలు

  • Shaheed Diwas: నేడు షహీద్ దివస్.. అమరవీరుల దినోత్సవాన్ని సంవత్సరానికి 3 సార్లు.. ఎందుకు? దాని ప్రాముఖ్యత ఏమిటి?

  • Arere Arere Song : సినీ ప్రముఖుల సమక్షంలో ‘అరెరే.. అరెరే’ మ్యూజిక్ వీడియో విడుదల!

  • QNet పై భారీ దాడులు… మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో వందల కోట్ల రూపాయలు వసూలు..!

  • CSK Hall of Fame: సీఎస్ కే హిస్టరీలో మైలురాయి.. ఫస్ట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సురేష్ రైనా, మాథ్యూ హేడెన్ ఎంట్రీ

  • Petrol Price Hike: పెట్రోల్‌, డీజిల్‌పై రూ.55 పెంపు.. అక్కడ రూ.321కి చేరిన లీటర్‌ పెట్రోల్‌ ధర..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions