Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Review Meeting In Gsdp

CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి పెట్టాలి..

Published Date :October 3, 2024 , 4:10 pm
By Chandra Shekhar Pamena
  • జీఎస్డీపీపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష..
  • 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలి..
  • గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ తగ్గింది..
  • ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి పెట్టాలి..
CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టి పెట్టాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Chandrababu: ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పని చేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో వృద్ది పై సచివాయలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఆయా శాఖల అధికారులు గత 10 ఏళ్ల కాలంలో పరిస్థితులను వివరించారు. గత పభుత్వం విధ్వంసకర విధానాలతో అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్లాయని.. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందని సీఎం అన్నారు.

Read Also: AP Excise Department: ఈ నెల 11న లాటరీ ద్వారా వైన్ షాప్స్ కేటాయిస్తాం..

కాగా, నేడు ప్రతిశాఖలో కొత్త పాలసీలు తీసుకువస్తున్నామని.. వీటిని సమర్థవంతంగా అమలు చేసి ఆర్థిక పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు.. ప్రజలపై అదనపు భారం లేకుండా ప్రభుత్వ ఆదాయం పెంచే విధానాలను అమలు చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో సమగ్ర యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గించవచ్చన్నారు. ప్రభుత్వం అంటే పథకాలు ఇవ్వడం మాత్రమే కాదని.. ఆయా రంగాలను బలోపేతం చేసి ప్రజల ఆదాయాలను పెంచడం ముఖ్యమని చెప్పుకొచ్చారు. 2014 తరువాత విభజన కష్టాలు ఉన్నా.. నాడు తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రం 13.7 శాతం గ్రోత్ రేట్ సాధించిందన్నారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వ రివర్స్ నిర్ణయాలతో వృద్ధి రేటు 10.59 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. 2019లో తెలంగాణతో పోల్చితే ఏపీ జీఎస్డీపీలో వ్యత్యాసం కేవలం 0.20 శాతం ఉండేది.. ఆ వ్యత్యాసం 2024కు 1.5 శాతానికి పెరిగిందన్నారు. 2014-15 మధ్య ఏపీ ప్రజల తలసరి ఆదాయం రూ.93,903 ఉండగా.. 2019 నాటికి రూ.1,54,031 పెరిగిందని చంద్రబాబు వెల్లడించారు.

Read Also: Beauty Tips: బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌తో ఇబ్బంది పడుతున్నారా..? ఇది ట్రై చేయండి

అలాగే, తెలుగుదేశం హయాంలో తలసరి ఆదాయం వృద్ధి 13.21 శాతం ఉండగా.. గత ప్రభుత్వంలో అది 9.06 శాతం మాత్రమే నమోదు అయిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి పడిపోయి.. ప్రజల జీవన ప్రమణాలు దెబ్బతిన్నాయన్నారు. నాడు తెలంగాణకు ఏపీ మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం కేవ‌లం 0.16 శాతం మాత్రమే ఉంటే.. గత ప్రభుత్వంలో అది 1.84 శాతానికి పెరిగింది.. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ తలసరి ఆదాయంలో 5వ స్థానంలో ఉంది.. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ శాఖలు విజన్ సిద్ధం చేసుకుని నిర్ధిష్ట లక్ష్యాలతో పని చేయాలన్నారు. కొన్ని శాఖలు బాగా వెనకబడి ఉన్నాయి.. వారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది.. త్వరలో ఈ మూడు రంగాల్లో లక్ష్యాలపై ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. జనవరిలో P4 విధానాన్ని ఆచరణలోకి తెస్తున్నాం.. ఈ విధానంతో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 10 శాతం మందని పైకి తెసుకువచ్చేందుకు సహాయం చేయాలని చంద్రబాబు అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • ap govt
  • AP Secretariat
  • cm chandrababu
  • GSDP

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates: అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ల దాడి..

  • Daughter of Prasad Rao : ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ ప్రభంజనం..

  • Gold Rates: యుద్ధ సమయంలో గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి, బంగారం ధరలు

  • 144Hz డిస్‌ప్లే, 50MP+50MP+50MP కెమెరాలు, 6500mAh బ్యాటరీతో Tecno Camon 50 Ultra 5G లాంచ్..!

  • Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ

  • Sanju Samson: విరాట్ కోహ్లీ లేకున్నా 196 రన్స్ ఛేజ్ చేశాం.. ప్రెస్ మీట్‌లో సంజు స్ట్రాంగ్ కౌంటర్!

ట్రెండింగ్‌

  • మరింత పవర్, మెరుగైన పనితీరు.. iPad Air (8th Gen) లాంచ్.. ధర ఎంతంటే?

  • Holi: చెడుపై మంచికి జయం.. భారతీయ సంస్కృతికి సజీవ ప్రతిబింబం హోలీ..!

  • Apple iPhone 17e లాంచ్.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions