AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన జరిగిన సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు ఎన్నికల సన్నద్ధతపై వేర్వేరుగా నివేదికలు సమర్పించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కారమైతే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం.. డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసుల్లో కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లో సుమారు 100 పురపాలికలు, నగర పంచాయతీల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయగలమని వెల్లడించింది. 2021లో ఎన్నికలు జరిగిన 100 పురపాలికలు, నగర పాలక సంస్థలు, నగర పంచాయతీల్లో 87 చోట్ల పాలకవర్గాల పదవీకాలం మార్చితో ముగిసింది. మరో 13 చోట్ల పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 22 వరకు కొనసాగనుంది. పదవీకాలం ముగిసిన 87 స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పురపాలక శాఖ ఎస్ఈసీకి తెలిపింది.
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇదిలా ఉండగా.. సమీప గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనం చేసేందుకు తీసుకొచ్చిన చట్టం-5ను సవాల్ చేస్తూ హైకోర్టులో 35 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు ఆదేశాల నేపథ్యంలో 2021లో 23 పురపాలికలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించలేదు. తాజాగా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థతో పాటు శ్రీకాళహస్తి, కావలి, ఆలూరు పురపాలికలు, నగర పంచాయతీలకు సంబంధించిన కొన్ని రిట్ పిటిషన్లు ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన కేసులను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ వెల్లడించింది.
మరోవైపు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ కూడా సన్నద్ధత వ్యక్తం చేసింది. 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించింది. వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలను ప్రచురించి ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపింది. అయితే కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల సుమారు 100 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. 2021 ఎన్నికల సమయంలో హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల కారణంగా 354 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో సుమారు 13,100 పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. మొత్తంగా పెండింగ్లో ఉన్న న్యాయపరమైన వివాదాలు పరిష్కారమై, వార్డులు, డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నట్లు ఎస్ఈసీకి స్పష్టత ఇచ్చాయి. దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణపై మరోసారి కదలిక మొదలైనట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ ప్రధానికి నరేంద్రమోడీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ..
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..