Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Amaravati Land Pooling Phase2 Farmers Question Legality Controversy 2026

Amaravati: ల్యాండ్ పూలింగ్లో మంత్రిని నిలదీసిన రైతులు.. చట్టబద్ధత ఎక్కడ, అభివృద్ధి ఏదీ..?

Published Date :January 7, 2026 , 11:55 am
By Chandra Shekhar Pamena
  • వడ్డమాను గ్రామసభలో గందరగోళం..
  • అమరావతి చట్టబద్ధత గురించి అడుగుతున్న రైతులు..
  • మొదటి విడత అభివృద్ధి ఎంత వరకు జరిగిందని ప్రశ్నిస్తున్న రైతులు..
  • అమరావతిలో ఏ రకమైన అభివృద్ధి జరిగిందని ప్రశ్నించిన రైతులు..
Amaravati: ల్యాండ్ పూలింగ్లో మంత్రిని నిలదీసిన రైతులు.. చట్టబద్ధత ఎక్కడ, అభివృద్ధి ఏదీ..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో రెండో విడత భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లాలోని వడ్డమాను గ్రామంలో తొలిరోజు గ్రామసభ నిర్వహించిన మంత్రి పొంగూరు నారాయణ, భూ సమీకరణ పర్యవేక్షణ కోసం CRDA అథారిటీ వడ్డమాను యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు, రైతులతో కలిసి భూ సమీకరణ అంశాలపై ప్రధానంగా చర్చించారు.

Read Also: Theft: కేపిహెచ్ బిలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో.. రూ.50 లక్షలు విలువైన వెండి ఆభరణాలు చోరీ

Also Read

  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
  • CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
Add as a preferred
source on google

అయితే, గ్రామసభలో పాల్గొన్న రైతులు అమరావతి చట్టబద్ధత, అభివృద్ధి, భూములు ఇచ్చే అన్నదాతలకు లభించే ప్రయోజనాలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..
* అమరావతికి చట్టబద్ధత ఎక్కడ ఉంది?
* మొదటి విడతలో ఎంత వరకు అభివృద్ధి జరిగింది?
* మొదటి విడతలో ఏ రకమైన అభివృద్ధి జరిగింది?
* మూడేళ్లలో అభివృద్ధి పూర్తవుతుందని గ్యారంటీ రాసిస్తారా?
* మూడేళ్లలో రాజధాని అభివృద్ధి కాకపోతే కోర్టుకు వెళ్లే పరిస్థితి వస్తుందా?
* ఇది గ్యారంటీనా? లేక రాజకీయ మాటలేనా? అని రైతులు ప్రశ్నించడంతో గ్రామసభ ఉద్రిక్తంగా మారింది.

Read Also: GST: జీఎస్టీ ఎగవేతపై డీజీజీఐ ఉక్కుపాదం.. రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు.. ఇద్దరు ఎండీలు అరెస్టు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ రైతుల ప్రశ్నలకు స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి చట్టం ఇప్పటికీ ఉంది, అది చట్టబద్ధమైన రాజధానిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. రాజకీయాల కోసమే గత ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందని తెలిపారు. మూడేళ్లలో రాజధాని అభివృద్ధి జరగకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం రైతులకు ఉంటుందని పేర్కొన్నారు. మొదటి దశలో అభివృద్ధి నెమ్మదిగా కొనసాగినా, ఇప్పుడు రెండో దశతో వేగం పెరుగుతోందని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పారు.

ఇక, రైతులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. 2019-24 మధ్య అమరావతిలో అభివృద్ధి జరగలేదని, కోర్టు ద్వారా ఏం సాధించారని ప్రశ్నించారు. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్ తీసుకున్న ఎంత వరకు అభివృద్ధి జరిగిందో అందరికి తెలుసని అన్నారు. కాగా, అమరావతిలో అభివృద్ధి కోసం మొత్తం 7 రెవెన్యూ గ్రామాల్లో 16,666.57 ఎకరాల భూ సమీకరణ చేయనుంది సీఆర్డీఏ. రైల్వే లైన్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తుంది. అయితే, వడ్డమానులో 1,937 ఎకరాలు, ఎండ్రాయిలో 2,166 ఎకరాల కోసం ఇప్పటికే అథారిటీలు వేర్వేరుగా నోటిఫికేషన్ ఇచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • amaravati capital
  • amaravati development
  • Amaravati Land Pooling
  • Andhra Pradesh
  • CRDA

తాజావార్తలు

  • Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!

  • Iran-US: ఇస్లామాబాద్‌లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!

  • Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..

  • DMK: కాంగ్రెస్‌ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..

  • Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions